కారు ప్రమాదం తర్వాత మొదటిసారి వీడియో షేర్ చేసిన రంభ… వైరల్ అవుతున్న వీడియో?

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన రంభ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎందరో స్టార్ హీరోల సరసన నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం రంభ తన భర్త పిల్లలతో కలిసి విదేశాలలో నివాసం ఉంటోంది. ఇదిలా ఉండగా ఇటీవల రంభ కారు ప్రమాదానికి గురైన సంగతి అందరికీ తెలిసింది. పిల్లల్ని స్కూల్ నుండి ఇంటికి తీసుకువస్తున్న సమయంలో రంభ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో రంభతో పాటు ఆమె పిల్లలు కూడా స్వల్ప గాయాలకు గురయ్యారు.

దీంతో ప్రమాదం జరిగిన వెంటనే అందర్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తాను, తన పిల్లలు క్షేమంగా ఉన్నామని రంభ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తన కారును మరో కారు వేగంగా వచ్చి ఢీకొట్టడం వల్లే ప్రమాదానికి గురైనట్లుగా తెలిపింది. తనకోసం.. తన పిల్లల క్షేమం కోసం ప్రార్థించిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులందరికీ రంభ ధన్యవాదాలు తెలియజేసింది. ఇన్‌స్టాలో లైవ్‌ లో వీడియో చేసి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసింది.

ప్రమాదం జరిగిన వెంటనే మాకు క్షేమం కోసం ప్రార్థించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నా పట్ల నా పిల్లల పట్ల మీ ప్రేమానురాగాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలి ఆసుపత్రిలో ఉన్న సాషా కూడా క్షేమంగా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకుందని ఈ సందర్భంగా వెల్లడించింది. ఇంత మంది అభిమానుల్ని పొందడం అదృష్టంగా భావిస్తున్నట్లుగా రంభ తెలిపింది. తన సంతోషాన్ని పంచుకోవడానికి మాటలు కూడా రావడం లేదని…. అభిమానులు చేసిన ప్రార్థనల ఫలితంగానే పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డామని రంభ వెల్లడించింది . ఈ సందర్భంగా మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ.. ప్రస్తుతం అందరం క్షేమంగా ఉన్నామని వెల్లడించింది.