సెన్సేషనల్ ప్రాజెక్ట్ లో రామ్ చరణ్, సాయి పల్లవి..?

ప్రస్తుతం తెలుగు సహా హిందీ మార్కెట్ నుంచి కూడా అనేక మంది దర్శకులు హీరోలు కూడా ఒకో ఇండస్ట్రీ వ్యక్తులు మరో ఇండస్ట్రీ వారితో అయితే సినిమాలు చేస్తున్నారు. అలా లేటెస్ట్ గా హిందీ దర్శకుడు టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం “ఆదిపురుష్” ఒకటి.

కాగా ఇప్పుడు ఇదే నేపథ్యంలో అయితే ఓ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవితో ఓ భారీ ప్రాజెక్ట్ ని చేయనున్నారు అని కొన్ని షాకింగ్ రూమర్స్ సినీ వర్గాల్లో వైరల్ గా మారాయి.

బాలీవుడ్ సినిమా దగ్గర ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన “దంగల్” చిత్ర దర్శకుడు నితీష్ తివారి అయితే ఇది వరకే రామాయణం చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ మాసివ్ ప్రాజెక్ట్ లో రామునిగా రామ్ చరణ్ అలాగే సీతగా అయితే సాయి పల్లవి నటించనున్నారని అయితే ఇప్పుడు గాసిప్స్ సినీ వర్గాల్లో మొదలయ్యాయి.

దీనితో ఈ క్రేజీ రూమర్ అయితే ఫ్యాన్స్ నిజం కావాలని కోరుకుంటున్నారు. నితీష్ తివారి టేకింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది దీనితో ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ మ్యాటర్ సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. ఇక ఇప్పుడు రామ్ చరణ్ అయితే దర్శకుడు శంకర్ తో “గేమ్ చేంజర్” అనే భారీ సినిమా చేస్తుండగా సాయి పల్లవి కూడా పలు చిత్రాల్లో అయితే బిజీగా ఉంది.