ఇప్పుడందరికీ రకుల్ టార్గెట్ అయిపోయింది.. ఇప్పుడే మళ్ళీ వస్తున్న టాలీవుడ్ అవకాశాల పరిస్థితేంటి..?

పిడుగొచ్చి ఎవరి మీద పడుతుందో తెలియదు అన్నట్టుగా అయిపోయింది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలలో డ్రగ్స్ వ్యవహారం. ఎప్పుడో రెండేళ్ళ క్రితం ఈ డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక కుదుపు కుదేపిసింది. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఛార్మి లతో పాటు మరికొంతమంది నటులు, ఇతర టెక్నీషియన్స్ మీద ఎంక్వైరీ జరిగింది. ఆ తర్వాత ఈ వ్యవహారం సద్దుమణిగింది. మళ్ళీ తాజాగా సుషాంత్ మృతితో రియా చక్రవర్తి ని విచారిస్తున్న సమయంలో ఈ వ్యవహారం గురించి కొందరు సినిమా సెలబ్రిటీస్ గురించి వెల్లడించింది.

rhea chakraborty news: Rhea Chakraborty judicial custody extended, to be in  jail till October 6, says Mumbai court - The Economic Times

మొత్తం 25 మంది పేర్లు రియా చెప్పినట్టు వార్తలు వస్తుండగా ప్రముఖంగా టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించుకుని ఫాం లో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్దా కపూర్, సారా అలీఖాన్ పేర్లు వినిపిస్తున్నాయి. తాజా సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత పేరు ప్రచారంలో నిలిచింది.

కాగా ఎటొచ్చి ఈ వ్యవహారం గుదిబండలా మారింది మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ కి అని ప్రచారం జరుగుతోంది. మిగతా వాళ్ళకి సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉంది. కాని రకుల్ కి మాత్రం ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదు. మోడల్ గా ఆ తర్వాత సినిమాలలో అవకాశాలు అందుకొని స్టార్ స్టేటస్ ని సంపాదించుకుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దాదాపు అందరి సరసన నటించి హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అందుకొని ఒక వెలుగు వెలిగింది రకుల్. అయితే వరస ఫ్లాపులతో టాలీవుడ్ లో అవకాశాలు అందుకోలేకపోయింది.

Krish Launches His Film With Vaishnav Tej

ఎట్టకేలకి మళ్ళీ మంచి అవకాశం అందుకుంది. స్టార్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న సినిమా.. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన వైష్ణవ్ తేజ్ హీరో. నిజంగా టాలీవుడ్ లో చాలాకాలం తర్వాత రకుల్ కి చాలా మంచి అవకాశం. కాని ఇప్పుడు ఈ డ్రగ్స్ వ్యవహారంతో రకుల్ కి ఎలాంటి షాకులు తగులుతాయో అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ వ్యవహారంతో రకుల్ కి సంబంధం లేదని అందరు నమ్ముతున్నారు. దర్శకుడు క్రిష్ కూడా రకుల్ కి సపోర్ట్ గా నిలిచాడు. చూడాలి మరి ఏం జరుగుతుందో.