శ్రీరామనవమికి బాలీవుడ్‌ రామాయణం పై ప్రకటన

‘యానిమల్‌ వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత బాలీవుడ్‌ హీరో రణబీర్‌ కపూర్‌ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్‌ రామాయణం. భారతీయ ఇతిహాసం ఆధారంగా రానున్న ఈ సినిమాకు దంగల్‌ ఫేమ్‌ నితేష్‌ తివారీ దర్శకత్వం వహిస్తుండగా.. రణబీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా, శాండల్‌వుడ్‌ స్టార్‌ యష్‌ రావణుడిగా నటించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌ సంబంధించి ప్రీ ప్రోడక్షన్‌ పనులు జరుపుకుంటున్నట్లు సమాచారం.

ఇదిలావుంటే తాజాగా ఈ ప్రాజెక్ట్‌ సంబంధించి ఒక సాలిడ్‌ అప్‌డేట్‌ సోషల్‌ విూడియాలో వైరల్‌ అవుతుంది. లేటెస్ట్‌ అప్‌డేట్‌ ప్రకారం ఏప్రిల్‌ 17న శ్రీరామ నవమి రోజున ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నట్లు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు టాక్‌. వచ్చే నెలలో ముంబైలో షూటింగ్‌ ప్రారంభమవుతుందని.. అలాగే ఈ ప్రాజెక్ట్‌ యొక్క మొదటి భాగాన్ని 2025 దీపావళికి విడుదల చేయడానికి ప్లాన్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ ప్రాజెక్ట్‌లో సన్నీ డియోల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, లారా దత్తా తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.