రానా మరో మల్టీస్టారర్.. మొత్తం మూడన్నమాట!

రానా దగ్గుబాటి రానున్న ముడేళ్ళల్లో సింగిల్ హీరోగా కనిపించడం కంటే ఎక్కువగా మల్టీస్టారర్ సినిమాలతోనే బిజీ అయ్యేలా ఉన్నడనిపిస్తోంది. వీలైనంత వరకు కథల విషయంలో రిస్క్ లేకుండా ప్రయోగాత్మకమైన కథలను ఎంచుకునే రానా ఇప్పుడు కమర్షియల్ గా కూడా ఆలోచిస్తున్నాడు. అన్ని వర్గాల ఆడియెన్స్ కు దగ్గరవ్వాలని మల్టీస్టారర్ కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇక ఇటీవల మరో కుర్ర హీరోకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు  తెలుస్తోంది. 


రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తో అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చిన రానా నెక్స్ట్ అరణ్య సినిమాను రిలీజ్ చేసే పనిలో బిజీ కానున్నాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే రానా, విశ్వక్ సేన్ కలిసి ఒక మినీ మల్టి స్టారర్ లో నటించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ పనులు శరవేగంగా కొనసాగుతున్నట్లు సమాచారం. కొత్త దర్శకుడు ఆ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.


పవన్, విశ్వక్ సేన్ వంటి వారితోనే కాకుండా తన బాబాయ్ వెంకటేష్ తో కూడా ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు రానా. రామానాయుడు కోరిక మేరకు సురేష్ బాబు తమ్ముడిని, కొడుకును వెండితెరపై చూపించాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక మొత్తానికి శతమానం భవతి వంటి హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన సతీష్ వేగేశ్న కూడా  రానా వెంకీ కోసం సినిమా కథను రెడీ చేయడానికి సిద్దమవుతున్నట్లు సురేష్ బాబు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు.