మిమ్మ‌ల్ని కాపాడుకోవ‌డానికి ఎంతో ప్ర‌య‌త్నించాను, కాని ర‌క్షించుకోలేకపోయా.. క్ష‌మించు నాన్న

జ‌యాప‌జాయ‌ల‌కు అతీతంగా ప్ర‌యోగాలు చేస్తూ మంచి ప్రాధా‌న్య‌త ఉన్న సినిమాలు చేస్తున్న భామ‌ రాయ్ ల‌క్ష్మీ. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఖైదీ నెం 150వ చిత్రంలో ర‌త్తాలు అనే సాంగ్‌తో దుమ్ము రేపిన ఐటం బాంబ్ ఆ మ‌ధ్య జిస్మ్ 2 అనే చిత్రంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ప్ర‌స్తుతం ప‌లు ప్ర‌యోగాత్మ‌క చిత్రాలు చేసేందుకు సిద్ధ‌మైంది. అయితే రాయ్‌ల‌క్ష్మీ తాజాగా త‌న సోష‌ల్ మీడియా ద్వారా త‌న తండ్రిని ర‌క్షించుకోలేక‌పోయాన‌ని ఎమోష‌న‌ల్ పోస్ట్ చేసింది. త‌న తండ్రికి సంబంధించిన జ్ఞాప‌కాలు షేర్ చేస్తూ చాలా బాధ‌ప‌డింది.

డాడీ మిమ్మ‌ల్ని మిస్ అవుతున్నాను. మీరు లేర‌నే బాధ‌ను నేను ఎలా అధిగ‌మించ‌గ‌ల‌ను. మీరు న‌న్ను ప్రేమించిన‌ట్టు ఎవ‌రు ప్రేమించ‌లేదు. మీరు లేర‌నే ఊహ నా గుండెల‌ని ముక్క‌లు చేస్తుంది. మిమ్మ‌ల్ని కాపాడుకోవడానికి చాలా ప్ర‌య‌త్నించాను. కాని ర‌క్షించుకోలేక‌పోయాను. క్ష‌మించండి నాన్న. అంతా బాగానే ఉంది అని చెప్ప‌డానికి మీరు నా ప‌క్క‌న ఉంటే బాగుండేద‌ని నా మ‌న‌సు అంటుంది. నా జీవితంలో ఎంతో స‌పోర్ట్‌గా నిలిచారు. మీ కూతురిగా పుట్ట‌డం నా అధృష్టం. న‌న్ను స్ట్రాంగ్‌గా ఉండ‌మ‌ని చెప్పేవారు. అంది ఎందుకో ఇప్పుడు అర్ధ‌మైంది. ఏదో ఒక రోజు మీరులేని లోటును నేను భరించాలని, తట్టుకోవాలని అలా చెప్పేవారు.

మీరు ఏ బాధ లేని ప్ర‌శాతమైన ప్లేస్‌లో ఉన్నార‌ని నాకు తెలుసు. ఇదే విష‌యాన్ని నా మ‌న‌సుకు చెప్పేందుకు ప్ర‌య‌త్నిస్తా.మీరు పై నుండి న‌న్ము ఆశీర్వదిస్తార‌ని నాకు తెలుసు. మీరు న‌న్ను న‌మ్మారు. మీ కొరిక‌ల‌ను నేను త‌ప్ప‌క నెర‌వేరుస్తాను. మంచి మ‌న‌సున్న వ్య‌క్తి హృద‌యం కొట్టుకోవ‌డం ఆగిపోయింది. దీంతో నా జీవితం అంధ‌కారంలో ఉండిపోయింది. నాన్న ఎప్సుడు మాతోనే ఉంటారు. మీ ఆత్మ‌కు శాంతి చేకూరాలి. మిమ్మ‌ల్ని చాలా మిస్ అవుతున్నాం అంటూ రాయ్ ల‌క్ష్మీ త‌న మ‌న‌సులోని బాధ‌ను సోష‌ల్ మీడియా ద్వారా బ‌య‌ట‌పెట్టింది. రాయ్ ల‌క్ష్మీకి పలువురు ప్రముఖులు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నారు.