Puneeth raj Kumar : జేమ్స్ చూడాలనుకోవడం లేదన్న పునీత్ భార్య…చూస్తూ మరణించిన అభిమాని…!

Puneeth Raj Kumar : కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణాన్ని ఇంకా అందరు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన చనిపోయిన రోజు నుండి నేటి వరకు ఏదో ఒక సందర్భంలో ఆయనను తలుచుకుంటూనే ఉన్నారు. ఇక ఆయన నటించినా చివరి చిత్రం జేమ్స్ ఆయన పుట్టినరోజు సందర్బంగా మార్చి 17 న విడుదలైంది. కన్నడ నాట మార్చి 25 వరకు మరే సినిమా విడుదల చేయకుండా కేవలం జేమ్స్ సినిమాను మాత్రమే థియేటర్స్లో వేసి పునీత్ రాజ్ కుమార్ కు నివాళి ఇచ్చారు కన్నడ చిత్ర సీమ.

ఇదిలా ఉంటే ఓ ఇంటర్వ్యూలో అప్పు చివరి చిత్రం జేమ్స్‌పై ఆయన భార్య అశ్విని పునీత్‌ రాజ్‌కుమార్‌ స్పందించారు. ఈ సందర్భంగా ఆమె ‘’తాను జేమ్స్’ సినిమా చూడలేను అన్నారు. ఎందుకంటే అందరిలా నేను ఆ సినిమా చూడలేకపోవచ్చు అంటూ కన్నీరు పెట్టుకున్నారు. జేమ్స్‌ మూవీ బాగా రూపుదిద్దుకుందని చిత్రబృందం, ప్రేక్షకులు చెబుతున్నారు. కానీ నేను చూడలేను కాబట్టి వెళ్ళలేదు.. జేమ్స్ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల గురించి పునీత్ నాకు చాలాసార్లు చెప్పారు. సినిమాలో వాడుతున్న టెక్నాలజీ గురించి కూడా ఆయన వివరించారు’ అని అశ్విని తెలిపారు.

ఇండస్ట్రీలో అన్ని రంగల్లోనూ కొత్తవారికి చోటు కల్పించాలనేది పునీత్‌ ఆశయం అని అశ్విని అన్నారు. ‘మా సంస్థ పీఆర్‌కే(పునీత్‌ రాజ్‌కుమార్‌ ప్రొడక్షన్‌) ద్వారా ఇది కొనసాగుతుంది. మా బ్యానర్‌ నుంచి వచ్చిన ప్రతి సినిమా సక్సెస్‌ కాకపోయాన మా బెస్ట్‌ ఇవ్వగలిగాం. అప్పును కోల్పోయిన బాధలో ఉన్న మాకు ఆయన అభిమానులు అండగా నిలిచారు.

జేమ్స్ సినిమాను తొలిరోజే థియేటర్లలో చూడటానికి అభిమానులు క్యూ కట్టారు. స్క్రీన్ పై పునీత్ ను చూసిన అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే పునీత్ ను స్క్రీన్ పై చూస్తూ ఒక అభిమాని గుండె ఆగింది. కర్ణాటక రాష్ట్రంలోని నంజనగూడు గ్రామానికి చెందిన 22 సంవత్సరాల వయస్సు ఉన్న ఆకాశ్ అనే కుర్రాడు ఇతర ఫ్యాన్స్ తో సినిమా చూస్తూ హార్ట్ అటాక్ తో మృతి చెందారు. పునీత్ మరణించినప్పటి నుంచి ఆకాశ్ బాధపడుతూనే ఉన్నాడని అతని కుటుంబ సభ్యులు చెప్పారు. ఆకాశ్ కు గతంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని అతని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆకాశ్ మృతికి పునీత్ అభిమానులు సంతాపం తెలియజేశారు. పునీత్ రాజ్ కుమార్ రీల్ లైఫ్ లోనే కాదని రియల్ లైఫ్ లో కూడా హీరోనేనని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.