KGF : కేజీఎఫ్ ను అప్పు సార్ కి అంకితమిచ్చిన ప్రశాంత్ నీల్…!

KGF : యష్ నటించిన ‘కెజిఎఫ్2’ ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్‌ కి రెడీ అవుతోంది. యష్ నటించిన కేజిఎఫ్ ఎంత భారీ విజయాన్ని అందుకున్న అందరికీ తెలిసిందే, సీక్వెల్ గా వస్తున్న కేజిఎఫ్ 2 మీద కూడా అంచనాలు అంతే రేంజ్ లో ఉన్నాయి. ఇక తూఫాన్ సాంగ్ విడుదల చేసిన తర్వాత యూట్యూబ్ లో ఇక తూఫాన్ మొదలయింది.

ఇక కేజీఎఫ్ 2 లో శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్త్, రవీనా టాండన్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకుడు. హంబల్ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం కన్నడ తో పాటు తెలుగు తమిళ, మలయాళం, హిందీ లలో విడుదలకాబోతోంది.

ఇక విడుదల సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు మేకర్స్. ఇందులో భాగంగానే నేడు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బెంగుళూరులో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ ని బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేయడం విశేషం.

ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ ” మా మాట మన్నించి ట్రైలర్ ని లాంచ్ చేసిన స్టార్ హీరోలందరికి ధన్యవాదాలు. ఈ సినిమాకోసం పనిచేసిన ప్రతిఒక్కరికి థాంక్స్ చెప్తున్నాను. అందరూ చాలా కష్టపడి పనిచేశారు. కెజిఎఫ్ ఫ్రాంచైజీ కోసం ఎనిమిదేళ్లు నాతో కలిసి ప్రయాణించిన వారందరికి కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ ఎనిమిదేళ్ల కష్టాన్ని దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు అంకింతమిస్తున్నాను. ఆయన లేనిలోటును ఎవరు తీర్చలేరు..” అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇక ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. పునీత్ కి ఇది నిజమైన నివాళి అంటూ కన్నడిగులు ప్రశాంత్ నీల్ ని ప్రశంసిస్తున్నారు.