Prakash Raj: పునీత్ సేవా కార్యక్రమాల బాధ్యత నాదే అంటున్న మోనార్క్..!

Prakash Raj: విలక్షణమైన నటనకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు ప్రకాష్ రాజ్. ప్రకాష్ పుట్టినది కర్ణాటక అయినా ఆయనకు తెలుగులోనే విశేషాదరణ లభించింది.  సుస్వాగతం సినిమాలోని మోనార్క్ పాత్రను అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నారు. సామాజిక సేవ చేయడంలో కూడా ఆయన ముందుంటారు.కరోనా కల్లోల సమయంలో ప్రకాశ్ రాజ్ ఎంతోమందికి సాయం అందించారు. చదువుకొనే పేదవారికి చేతనైన సహాయం చేయడంలోనూ, కష్టాల్లో ఉన్నారని తెలిసిన వారిని స్వచ్ఛందంగా ఆదుకోవడంలోనూ ప్రకాశ్ రాజ్ ఎప్పుడూ ముందుంటారు.

తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక కీలక ప్రకటన చేశారు.కన్నడ పవర్‌ స్టార్‌, దివంగత నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌(అప్పు) సేవల తన ఫౌండేషన్‌ ద్వారా ముందుకు తీసుకెళ్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేస్తూ.. ‘నా ప్రత్యేకమైన రోజున మీ అందరితో ఈ శుభవార్త పంచుకుంటున్నందుకు ఆనందం ఉంది. పునీత్‌ రాజ్‌కుమార్‌ ప్రారంభించిన సేవలను ఇకపై ప్రకాశ్‌ రాజ్‌ ఫౌండేషన్‌ ద్వారా ముందుకు తీసుకేళ్లబోతున్నాను. అంటూ అప్పు ఫొటోను షేర్‌ చేశారు.

త్వరలోనే కార్యాచరణ కు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటిస్తాను అని తెలియజేశారు.ఈ సందర్భంగా ‘అప్పు ఎక్స్‌ప్రెస్‌’ అని రాసి ఉన్న ఈ పోస్ట్‌ను ఆయన పంచుకున్నారు. ప్రకాష్ రాజ్ చేసిన ఈ కీలక ప్రకటన కు పునీత్ అభిమానులతో పాటు నెటిజన్లు అందరూ స్పందిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.