సంకటంలో ఏ.ఎమ్.రత్నం.!

పవన్ కళ్యాణ్‌తో ఓ రీమేక్ సినిమా చేద్దామని ముందుగా అనుకున్నారు ప్రముఖ నిర్మాత ఏఎమ్ రత్నం. అయితే, అనూహ్యంగా స్ర్టెయిట్ సినిమా టచ్ చేశారు. అదే ‘హరి హరవీరమల్లు’.

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కానీ, తొలి నుంచీ ఈ సినిమాకి ఏదో ఒక రకంగా ఆటంకాలు ఎదురవుతున్నాయ్. దీని కన్నావెనకొచ్చిన ‘బ్రో’ సినిమా షూటింగ్ అయిపోవడం, రిలీజ్ అయిపోవడం కూడా అయిపోయింది.

అలాగే ‘ఓజీ’ కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కానీ, ‘హరి హర వీరమల్లు’ మాత్రం ముందుకు కదలడం లేదు. తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ విషయంలో ఏఎమ్ రత్నం అంచనాలు తప్పాయి. చూస్తుంటే ఇప్పట్లో పవన్ కళ్యాణ్ డేట్స్ కూడా దొరికేలా కనిపించడం లేదు. దీంతో, చేసేది లేక నిర్మాత ఏఎమ్ రత్నం ఓ డెషిషన్‌కి వచ్చారట.

సినిమా ఎంతవరకూ పూర్తయ్యిందో అంత వరకూ మొదటి పార్ట్‌గా పూర్తి చేసి వదలడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఎలాగూ ఈ సినిమాని రెండు పార్టులుగా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. సో, మొదటి పార్ట్ ఇలా ఓ కొలిక్కి వచ్చేస్తుందని అనుకుంటున్నారట.

ఎలాగోలా పవన్ కళ్యాణ్ నుంచి కొన్ని డేట్స్ తీసుకుని మిగిలిన పార్ట్ కూడా కంప్లీట్ చేసేయాలని అనుకుంటున్నారట. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎలక్షన్ల లోపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని గట్టిగా కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది.