మంత్రి రోజా పై సంచలన వ్యాఖ్యలు చేసిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ?

30 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ అంటూ సినిమాలలో కామెడీ చేస్తూ అందరిని నవ్వించిన పృద్వి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమెడియన్ గా మాత్రమే కాకుండా విలన్ గా కూడా ఎన్నో సినిమాలలో కూడా నటించాడు. ఇలా విలన్ గా కమెడియన్ గా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రవేశించి వైసిపికి మద్దతు ఇచ్చాడు. దీంతో జగన్ సర్కార్ పృద్విని టిడిపి చైర్మన్ గా నియమించింది. అయితే అక్కడ మహిళల పట్ల పృథ్వి వ్యవహరించిన తీరుతో విమర్శలు ఎదుర్కొని పదవిని కోల్పోయాడు.

ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని అతని సర్కారుని నిందిస్తారు సంచలన విమర్శలు చేస్తూ వస్తున్న వృద్ధి తాజాగా మంత్రి రోజా మీద కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ వైజాగ్ లో జరిగిన జనవాణి కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో కొన్ని మీడియా సంస్థలు పవన్ కళ్యాణ్ గురించి ఈ కార్యక్రమం గురించి దుష్ప్రచారం చేస్తున్నాయని పృద్వి మండిపడ్డారు. ఇక ఈ సందర్భంలో మంత్రి రోజా గురించి మాట్లాడుతూ… వైజాగ్‌లో వైసీపీ గర్జన కార్యక్రమం ఫ్లాప్ కావడంతో జనసేన కార్యక్రమంపై రోజా బురదజల్లే ప్రయత్నం చేసిందని పృద్వి వెల్లడించాడు.

పవన్ కళ్యాణ్ మీద రోజా ఎన్నోసార్లు నోరు పారేసుకున్న సినీనటి, మంత్రి రోజాపై నేను ఎన్నడూ విమర్శలు చేయలేదు. కానీ పవన్ కల్యాణ్‌ను విమర్శించకపోతే తనకి ఉన్న మంత్రి పదవి పోతుందనే భయం రోజాలో ఉందని అందుకే తరచూ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తుందని పృథ్వి వెల్లడించాడు. మేమందరం సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తూ కళామాతల్లి బిడ్డలుగా ఎంతో హుందాగా ప్రవర్తిస్తున్నాము కానీ రోజా మాత్రం ఆ హుందాతనాన్ని చూపించుకోవడం లేదు అంటూ విమర్శలు చేశాడు. రాజకీయపరంగా పవన్ కళ్యాణ్ ని ఎదుర్కోలేక వ్యక్తిగత విషయాల గురించి విమర్శించటం సరికాదని పృద్వి చెప్పుకొచ్చాడు.