కొంచెం ఓపిక పట్టండి.. అభిమానులకు యశ్‌ విజ్ఞప్తి!

కేజీఎఫ్‌’ సిరీస్‌ చిత్రాలతో గ్లోబల్‌ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న శాండల్‌వుడ్‌ హీరో యశ్‌ నటించిన ’కేజీఎఫ్‌2’ విడుదలై ఏడాదిన్నర కావస్తున్నా.. ఇప్పటి వరకూ తదుపరి చిత్రం గురించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. దాంతో అభిమానులు కాస్త నిరాశ చెందుతున్నారు. కొందరైతే కేజీఎఫ్‌ భారీ విజయం సాధించడంతో యశ్‌ రిలాక్స్‌ మోడ్‌లో ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.

తాజాగా ఓ వేడుకలో పాల్గొన్న యశ్‌ మాట్లాడుతూ తదుపరి చిత్రం గురించి గుడ్‌ న్యూస్‌ చెప్పారు. యశ్‌ మాట్లాడుతూ ‘నేనేం విశ్రాంతి తీసుకోవడం లేదు. నా ఫ్యాన్స్‌కు సగం కుక్‌ చేసిన ఫుడ్‌ పెట్టడం ఇష్టం లేదు. నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికీ రుచికరమైన భోజనం రూపంలో అందరూ గర్వపడేలా సినిమా తీస్తా. కాస్త ఓపిక పట్టండి‘ అని అన్నారు.

మంచి సినిమాతో వస్తానని మాటిచ్చినా.. అభిమానులు మాత్రం ఇంకా నిరాశ నుంచి బయటకు రాలేదు. యశ మాత్రం తదుపరి చిత్ర కథ. పాత్ర తీరు తెన్నుల గురించి చాలా కష్టపడుతున్నారు. కేజీఎఫ్‌ లాంటి చిత్రం తర్వాత వచ్చేది అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండాలని ఆయన తపన పడుతున్నారు. ఆ దిశగానే కథల ఎంపికలో ఆచితూచి అడుగేస్తున్నారు.

అయితే తాజాగా యశ తాజా చిత్రం గురించి ఓ వార్త వైరల్‌ అయిన సంగతి తెలిసిందే! మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్‌తో ఆయన చర్చలు జరిపారని వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా రానుందని వార్తలు వచ్చాయి. అయితే.. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అలాగే బాలీవుడ్‌లో రూపొందనున్న రామాయణం సినిమాలోనూ యశ్‌ రావణుడిగా కనిపించనున్నాడని టాక్‌ వినిపిస్తోంది.