Prakash Raj: మోదీకి చికిత్స అందించండంటూ ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్ .. ఆయనకున్న జబ్బేనని స్పష్టం చేసిన విలక్షణ నటుడు!

Prakash Raj: మొన్నటి వరకబ విలక్షణ నటుడిగా మాత్రమే గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్, ఇటీవల జరిగిన మా ఎన్నికల నుంచీ పలు వివాదాస్పద ఘటనల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తూ పలు వివాదాల్లో ఇరుక్కుంటున్నారని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఇక ఈ మధ్య కాలంలో ఆయన రాజకీయ నాయకుల వ్యాఖ్యలపైన కూడా స్పందిస్తూ సంచలనంగా మారుతున్నారు. ఇటీవల ఏపీలో వైకాపా పార్టీకి వ్యతిరేకంగా ఆయన వ్యాఖ్యానించడం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆయన, ప్రధాని మోదీ పై కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తూ మరోసారి వార్తల్లో నిలిచారు.

ఇటీవల మహారాష్ట్ర భాజాపా చీఫ్ చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజు సోషల్ మీడియా వేదికగా వెటకారంగా వ్యాఖ్యలు చేసి అందరికీ షాకిచ్చారు. ఇకపోతే ఒక సమావేశంలో చంద్రకాంత్ పాటిల్.. ప్రధాని మోదీ రెండు గంటలు మాత్రమే నిద్ర పోతారని.. ఇక రోజులో 22 గంటల పాటు ఆయన పని చేస్తూనే ఉంటారు అని అన్న విషయం తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలపై తాజాగా ప్రకాష్ రాజ్ స్పందించడం ప్రస్తుతం సంచలనంగా మారింది. కాగా, చంద్రకాంత్ పాటిల్ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రకాష్ రాజ్ ట్వీట్ చేస్తూ దయచేసి మీరు కూడా కొంచెం కామన్సెన్స్ ఉపయోగించండి.. ఎవరైనా సరే రోజుకు ఇరవై రెండు గంటలు పనిచేస్తున్నారంటే వారికి ఏదైనా జబ్బు ఉందని గమనించాలి. నిద్రపో లేకపోవడం అనేది అతి పెద్ద జబ్బు అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు ప్రకాష్ రాజ్.

వైద్య పరిభాషలో దీనిని ఇన్సోమ్నియా అని పిలుస్తారన్న ఆయన, ఈ జబ్బు గురించి గొప్పగా చెప్పుకోవడం కాదు వెంటనే ఆ జబ్బుతో బాధ పడుతున్న మీ నాయకుడికి చికిత్స అందించంటూ ప్రకాష్ రాజ్ తాజాగా చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇలా అవకాశం వస్తే చాలు ప్రకాష్ రాజ్ బీజేపీ నాయకులపైనే కాకుండా మోడీ పైనా విమర్శలు గుప్పిస్తూ ట్రెండింగ్‌గా నిలుస్తున్నారు. మొన్నటికి మొన్న ది కశ్మీరీ ఫైల్స్ చిత్రంపైనా స్పందించిన ప్రకాష్ రాజ్, ఈ చిత్రం పాత గాయాలను మాన్పేస్తుందా ? లేక మరింత రెచ్చగొట్టేందుకు దారి తీస్తుందా ? జస్ట్ ఆస్కింగ్.. అంటూ ఆయన చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారడం అందరికీ తెలిసిందే.