మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబో ఫిక్సైందా ..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ మీద అటు ఫ్యాన్స్ లో గాని ఇటు ప్రేక్షకుల్లో గాని ఉండే క్రేజ్ ఎంతటిదో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి.. సినిమాలు వచ్చిన సంగతి తెలిసందే. మొదటి రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకోగా హ్యాట్రిక్ సినిమాగా వచ్చిన అజ్ఞాతవాసి మాత్రం ఘోర పరాజయాన్ని అందుకుంది.

Pawan Kalyan's next moves to Sankranthi ?

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వెళ్ళడం తో ఇక సినిమాలు చేయడన్న ప్రచారం జరిగింది. కాని అనూహ్యంగా వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. దాంతో ముందుగా అందరూ ఆశగా ఎదురు చూసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్ గురించే. అయితే వకీల్ సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్ వరసగా నాలుగు ప్రాజెక్ట్ లు కమిటయినప్పటి ఆ సినిమాలలో ఒక్కదానికి కూడా త్రివిక్రమ్ దర్శకత్వం వహించడం లేదు.

Pawan Kalyan to star in 'Ayyappanum Koshiyum' Telugu remake, Venky Atluri to  direct | The News Minute

ఇదే ఫ్యాన్స్ అందరికి బాగా నిరాశ కలిగించే అంశం. కాని ఇటీవల బండ్ల గణేష్ నిర్మాతగా ఒక సినిమా అనౌన్స్ అయింది. ఆ సినిమాకి ఖచ్చితంగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తాడని అనుకుంటున్నారు. ఈ విషయంలో క్లారిటీ వచ్చేలోపే పవన్ సినిమాకి త్రివిక్రమ్ పని చేయబోతున్నాడని సమాచారం. రీసెంట్ గా పవన్ “అయ్యప్పనం కోషియం” రీమేక్ చేస్తున్నట్టు ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే.

సాగర్ చంద్ర దర్శకత్వం వహించనుండగా త్రివిక్రమ్ డైలాగులు, రచనా సహకారం అందించనున్నాడని అది కూడా పవర్ స్టార్ కోరిక మేరకే అని తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన అధికారక ప్రకటన రావడమే తరువాయి అని తెలుస్తుంది.