క్రిష్‌తో సెట్స్ పైకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. ఎగిరిగంతులేస్తున్న ఫ్యాన్స్ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని తిరిగి ‘వకీల్ సాబ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న ఆయన.. వరుస సినిమాకు కమిటైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవలే వకీల్ సాబ్ షూటింగ్ ఫినిష్ కావడంతో తర్వాత పవన్ ఏ సినిమా పూర్తి చేస్తారనే దానిపై చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా క్రిష్‌తో చేయబోతున్న సినిమా రెగ్యులర్ షూట్ మొదలు పెట్టేస్తూ అభిమానులను ఖుషీ చేశారు పవన్ కళ్యాణ్.

వకీల్ సాబ్ తర్వాత మళయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా తెలుగు రీమేక్‌‌లో పవన్ కళ్యాణ్ నటించనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించారు కూడా. అయితే మెగా అభిమానుల్లో జోష్ నింపేలా పవన్ కళ్యాణ్ ఈ మూవీతో పాటు ప్యారలల్‌గా క్రిష్ సినిమాను పూర్తి చేయాలని ఫిక్సయ్యారట.

ఈ మేరకు క్రిష్‌తో అన్ని విషయాలు చర్చించి సెట్స్ పైకి వచ్చేశారు పవన్. మెగా సూర్య ప్రొడక్షన్‌ బ్యానర్‌పై రూపొందనున్న ఈ మూవీ సోమవారం సెట్స్‌పైకి వచ్చిందని పేర్కొంటూ చిత్ర నిర్మాణ సంస్థ అఫీషియల్‌‌గా ట్వీట్ చేసింది. ఈ మేరకు షూటింగ్‌ లొకేషన్‌ ఫొటోలను షేర్ చేసింది. పీరియాడికల్ డ్రామాగా రూపొందనున్న ఈ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో 27వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది