విధి నన్ను మోసం చేసింది..పోరాటం చేయలేకపోతున్నా : పూనమ్ కౌర్

నటిగా ఫూనమ్ కౌర్ ఎంత ప్రామఖ్యత తెచ్చుకున్నారో తెలియదు కానీ, వివాదాలతో మాత్రం టాలీవుడ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. పవర్ స్టార్ సెంట్రిక్‌గా పలు కామెంట్స్ చేసిన ఆమె రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించారు. ఆ మధ్య ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య జరిగిన వార్‌లో అనూహ్యంగా పూనమ్ కౌర్ పేరు తెరపైకి వచ్చింది. కొన్ని ఆడియోలు, ఫోటోలు టాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. పవన్‌తో పాటు గురూజీ అంటూ త్రివిక్రమ్‌ను కూడా ఇన్ డైరెక్ట్‌గా సోషల్ మీడియాలో టార్గెట్ చేసేది పూనమ్ కౌర్. బెత్తం దెబ్బలు అంటూ, పవర్ ఫుల్ లీడకం అంటూ పవన్ ను కాసేపు పొగుడుతూ, కాసేపు తిడుతూ పవర్‌ఫుల్ పోస్టులు వేస్తుంటుంది ఈమె.

కేవలం పవన్, త్రివిక్రమ్ మాత్రమే కాదు టైమ్‌ని బట్టి పూనమ్ ఒక్కో వ్యక్తిని టార్గెట్ చేస్తోంది. ఓ పెద్ద డైరెక్టర్ తనను ఎలా బాధపెట్టాడో ఒకసారి వివరించింది. ఆ మధ్య ఒత్తిడి గురించి మాట్లాడుతూ.. తన జీవితంలోనూ అలాంటి ఘటనలు ఎదురయ్యాయని వివరించింది. సుశాంత్ సింగ్ మరణంపై కూడా తన మార్క్ కామెంట్స్ తో వివాదం రేపింది. బాలీవుడ్‌లో మోసాలపై గళమెత్తింది. ప్రముఖ జర్నలిస్ట్ అర్నబ్ అరెస్ట్, కంగనా రనౌత్ సోదురుడి ఇలా అన్ని ఇష్యూలపై ఆమె ఓ ట్వీటో, పోస్టో వేసి అటెన్షన్ గ్రాబ్ చేస్తోంది.

ఇక తాజాగా మరోసారి పూనమ్ ట్వీట్ పవన్ టార్గెట్‌గా నడిచింది. ఈ రోజు జాతీయ న్యాయదినోత్సవమని పేర్కొంటూ.. తాను ఓ న్యాయవాదిని అయి ఎంతో పోరాటం చేద్దామనుకున్నానని..కానీ ఆ కోరిక నెరవేరలేదని చెప్పుకొచ్చింది. విధికి తెలుసు ఎటు తీసుకువెళ్లాలో తెలుసని.. అది ఏమనుకుంటే అదే జరుగుతుందని పేర్కొంది. అయితే ఈ భామ ఏదో ఒక రోజు బిగ్ బాంబ్ పేల్చే అవకాశం ఉందని టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్ లో చర్చ జరుగుతోంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.