పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరుకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా తక్కువ సమయంలోనే పవన్ కళ్యాణ్ కు ఊహించని స్థాయిలో పాపులారిటీ దక్కింది. జనసేన పార్టీ ద్వారా అధికారంలోకి రావాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారనే సంగతి తెలిసిందే.
అయితే 2004 సంవత్సరంలో ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నాకు పెద్దగా మాట్లాడటం రాదు సినిమాలలో యాక్ట్ చేయడం తప్ప అంతకు మించి నాకేం తెలియదని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. సభాముఖంగా మీతో చాలాసార్లు మాట్లాడాలని అనుకుంటానని చిరంజీవి గారి గురించి చాలా చెప్పాలని అనుకుంటానని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. ప్రతిసారి అభిమానులు చూపించే అభిమానానికి మౌనం తప్ప మాటలు రావని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు.
నాలోని అణువణువు కృతజ్ఞతా భావం తప్ప ఇంకేం లేదని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. నేను తక్కువగా మాట్లాడితే మీపై నాకు అభిమానం తక్కువని అనుకోవద్దని ఆయన కామెంట్లు చేశారు. అభిమానులు అంటే తనకు ఎంతగానో ఇష్టమని ఆయన చెప్పుకొచ్చారు. 2004 సంవత్సరంలో ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ చేసిన ఈ స్పీచ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు. తర్వాత సినిమాలతో కూడా పవన్ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తర్వాత సినిమాలతో పవన్ కళ్యాణ్ కు ఎలాంటి రిజల్ట్స్ దక్కుతాయో చూడాల్సి ఉంది. హరిహర వీరమల్లు సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సినిమాసినిమాకు పవన్ కళ్యాణ్ కు క్రేజ్ పెరుగుతోంది.
