“ఓజి”..మొదటికే మోసం తీసుకురాడు కదా.!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇపుడు నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో యంగ్ దర్శకుడు సుజీత్ తో చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ “ఓజి” కూడా ఒకటి. పూర్తిగా ఫ్రెష్ సబ్జెక్టు ఇది కావడంతో పవన్ ఫ్యాన్స్ యమ ఉత్సాహంగా ఈ సినిమా పట్ల ఉన్నారు. కాగా ఇప్పుడు దీనికి చిన్న బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ చిత్ర యూనిట్ మాత్రం తమ పని తాము చేస్తున్నారు.

కాగా నిన్ననే ఈ సినిమా నుంచి మాసివ్ అనౌన్సమెంట్ ప్రముఖ బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నట్టుగా అదిరే అప్డేట్ ని చిత్ర యూనిట్ రివీల్ చేశారు. దీనితో హైప్ అలా పెరిగిపోతూ వస్తుంది. మొన్నటికి మొన్న అర్జున్ దాస్ ఆ తర్వాత నటి శ్రీయా రెడ్డి ఇప్పుడు ఇమ్రాన్ హష్మి ఈ భారీ తారాగణం చూసి అయితే అసలు సుజీత్ ఏం చేస్తున్నాడా అని ఫ్యాన్స్ వెర్రెత్తి పోతున్నారు.

దీనితో మళ్లీ నటీనటులు వరకు పవన్ కి పంజా ఎలాగో సుజీత్ కి సాహో లా ఇపుడు ఓజి సెట్ అయ్యింది అంటున్నారు. అయితే ఇది బాగానే ఉన్నప్పటికీ సుజీత్ విషయంలో మాత్రం ఇప్పుడు ఫాన్స్ ఆడుఎంస్ కాస్త డౌట్ పడుతున్నారు. లాస్ట్ టైం సాహో కి కూడా ఇలాంటి భారీ తారాగణంతోనే సుజీత్ ఆ సినిమా అంతా నింపేసాడు.

ఇపుడు ఓజి కి కూడా ఇలాగె చేస్తుండడంతో కాస్త టెన్షన్ అయితే పడుతున్నారు. మరి దీనితో మళ్ళీ మొదటికే మోసం తీసుకురాడు కదా అని అయితే మూవీ లవర్స్ అనుకుంటున్నారు. ఇక ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే RRR నిర్మాణ సంస్థ డీవీవీ వారు నిర్మాణం అందిస్తున్న సంగతి తెలిసిందే.