పవన్ కళ్యాణ్ నిర్మాతల్లో పెరిగిపోతున్న టెన్షన్.!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగేసింది.! అదీ ఒకందుకు మంచిదే.. తెలుగు సినిమాకి.! డిసెంబర్ మొదటి వారానికి ఎన్నికల హంగామా మొత్తం పూర్తయిపోతుంది. ఈలోగా షూటింగులు జాగ్రత్తగా పూర్తి చేసేసుకోవచ్చు.. పెద్ద సినిమాలకు సంబంధించి.

పవన్ కళ్యాణ్ సినిమాల మాటేమిటి.? అవీ అంతే.! ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలు ప్రస్తుతం లైన్లో వున్నాయ్. ‘హరిహర వీరమల్లు’ సినిమా సైడ్ ట్రాక్ మీద తాత్కాలికంగా ఆగిపోయింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకీ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకీ మధ్య గ్యాప్‌లో ఓ సినిమా విడుదల చేస్తే బావుంటుందని పవన్ కళ్యాణ్ నిర్మాతలు అనుకుంటున్నారట. కానీ, ఆ రిస్క్ చేసేదెవరు.?

ఈ విషయమై ‘ఓజీ’ నిర్మాతలూ, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నిర్మాతలూ ఇప్పటికే వపన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారట. వారి వెంట ఆయా చిత్రాల దర్శకులూ వున్నారట. కానీ, వ్యవహారం ఓ కొలిక్కి రాలేదని అంటున్నారు.

2‌024 ఎన్నికల్లోపు పవన్ కళ్యాణ్ నుంచి ఏదో ఒక్క సినిమా అయినా రాకపోతే.? ఆ తర్వాత పరిస్థితులు ఎలా వుంటాయో చెప్పలేం.! అందుకే, నిర్మాతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. చిత్రంగా ‘హరిహర వీరమల్లు’ సినిమా నిర్మాత ఏఎం రత్నం మాత్రం లైట్ తీసుకుంటున్నారు ప్రస్తుత పరిస్థితుల్ని.