మరోసారి పాట పాడనున్న పవర్ స్టార్.. ఫ్యాన్స్‌కు పూనకాలే

టాలీవుడ్ హీరోలు సినిమాల కోసం గాయకులుగా మారటం గతంలో చాలా సందర్భాల్లో చూశాం. కానీ ఒకే పాటను ఇద్దరు హీరోలు పాడితే.. ఫ్యాన్స్‌కు పూనకాలే కదా.. అలాంటి ఓ బంపర్ ఆఫర్‌ ఇస్తున్నారు ఓ పవర్‌ఫుల్ హీరో. పవర్ అనగానే మీకు విషయం అర్థమయ్యి ఉంటుంది. యస్..మేము మాట్లాడేది పవన్ కళ్యాణ్ గురించే. ప్రస్తుతం పవన్ వకీల్ సాబ్ సెట్స్‌పై ఉండగానే.. మరో ఇంట్రస్టింగ్‌ రీమేక్‌కు ఓకే చెప్పారు. మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనుమ్ కోషీయం రీమేక్‌లో నటించేందుకు పచ్చజెండా ఊపారు. ఈ మూవీలో పవన్‌ పోలీస్‌ పాత్రలో నటిస్తుండగా.. మరో కీలక పాత్రలో యంగ్ హీరో రానా నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ న్యూస్ ఫిల్మ్ సర్కిల్‌లో తెగ చక్కెర్లు కొడుతోంది.

సీరియస్‌ మోడ్‌లో సాగే కథ కావటంతో ఈ సినిమాలో సాంగ్స్‌కు అవకాశం లేదు. అందుకే మలయాళంలో పృథ్వీరాజ్‌, బిజు మీనన్‌తో ఓ ప్రత్యేకమైన సాంగ్‌ను షూట్‌ చేశారు. ఆ సాంగ్‌ వాళ్లిద్దరే స్వయంగా పాడారు. ఇప్పుడు అదే ఫార్ములాను తెలుగులోనూ కొనసాగిస్తున్నారట డైరెక్టర్‌ సాగర్ కే చంద్ర. పవన్‌, రానాలతో ఓ పాటను పాడించేందకు ప్రయత్నాలు ముమ్మురం చేశారట. పవన్‌కు తన సినిమాల్లో పాటలు పాడటం గతంలో కూడా చూశాం. అనుభవం ఉన్న సింగర్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా పవన్ పాటలు పాడతారు.. కానీ పవన్‌తో కలిసి రానా పాట పాడటం మాత్రం నిజంగానే క్రేజీ న్యూస్.

మల్టీ టాలెంటెడ్‌ నటుడిగా ప్రూవ్‌ చేసుకున్న రానా… కొత్త సినిమాలకు సంబంధించి కొత్త సవాళ్లను స్వీకరించేందుకు ఎప్పుడూ రెడీగా ఉంటారు.. అందుకే ఈ సినిమాలో రానా పాట పాడటం కూడా పక్కా అంటున్నారు దగ్గుబాటి అభిమానులు. మరి నిజంగానే పవన్‌, రానా ప్రమోషనల్‌ సాంగ్‌తో అలరిస్తారా..? ఈ మలయాళ రీమేక్‌ టాలీవుడ్‌ ఆడియన్స్‌కు అదిరిపోయే కిక్ ఇస్తుందా..? ఈ అంశాలు తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.