పవన్ కళ్యాణ్ .. క్రిష్ కి 40 రోజులిస్తే సినిమాని చూట్టేస్తాడేమో ..?

పవన్ కళ్యాణ్ .. క్రిష్ కాంబినేషన్ లో మొఘలుల కాలం నాటి కథ తో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఇటీవలే వకీల్ సాబ్ సినిమాని కంప్లీట్ చేశాడు. దాంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ లైనప్ చేసుకున్న సినిమాలలో ఏ సినిమాకి డేట్స్ ఇవ్వబోతున్నాడు..అని అందరూ చర్చించుకుంటున్నారు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తర్వాత చేయాల్సింది క్రిష్ సినిమానే. కాని మధ్యలో మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుం కోషియం వచ్చి చేరింది. ఈ సినిమాకే పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చాడని ప్రచారం జరిగింది.

PSPK 27" First Look Revealed By Director Release Date Star Cast Trailer  Teaser

అయితే ఈ సినిమా అనూహ్యంగా పెండింగ్ పడిందని సమాచారం. దాంతో వెంటనే పవన్ కళ్యాణ్ క్రిష్ ని పిలిచి సినిమా మొదలు పెడదామని చెప్పాడట. దాంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్రిష్ వెంటనే తన టీం తో పవన్ కళ్యాణ్ సినిమాకి షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నాడట. అంతేకాదు ఈ సినిమా జనవరి నాలుగో తేదీ నుంచి సెట్స్ మీదకి వెళ్ళబోతుందని సమాచారం. అంతేకాదు పవన్ కళ్యాణ్ క్రిష్ కి వరం ఇచ్చినట్టుగా ఏకంగా నాన్ స్టాప్ గా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు 40 రోజులు డేట్స్ ఇస్తానని చెప్పినట్టు సమాచారం.

ఒకవేళ ఇదేగనక నిజమైతే క్రిష్ ఈ 40 రోజుల్లో దాదాపు సినిమాని కంప్లీట్ చేసేస్తాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నాడు. క్రిష్ కి హీరోలు సరిగ్గా డేట్స్ ఇవ్వాలే గాని లాంగ్ షెడ్యూల్ ఫిక్స్ చేసి ఎలాంటి సినిమా అయినా కంప్లీట్ చేసేస్తాడు. అందుకు ఉదాహరణ కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి, రీసెంట్ గా వైష్ణవ్ తేజ్ – రకుల్ ప్రీత్ సింగ్ తో కంప్లీట్ చేసిన లేటెస్ట్ సినిమా. ఇక పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాకి ఇప్పటికే సెట్స్ రెడీగా ఉన్నాయట. బాలీవుడ్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండస్ ఒక హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకి విరూపాక్ష అన్న టైటిల్ ప్రచారం లో ఉంది.