ప్రస్తుతం టాలీవుడ్ నుంచి రాబోతున్న పలు ఇంట్రెస్టింగ్ మల్టీ స్టారర్ చిత్రాల్లో ఈ ఏడాది మెగా ఫ్యాన్స్ కి ఆల్రెడీ ట్రీట్ ఇచ్చిన “వాల్తేరు వీరయ్య” తర్వాత మెగాస్టార్ తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ల కాంబినేషన్ లో వెర్సటైల్ నటుడు సముద్రఖని తెరకెక్కించిన చిత్రం కూడా ఒకటి.
మొదట్లో ఫ్యాన్స్ పెద్దగా ఈ సినిమాపై ఆసక్తి చూపలేదు కానీ ఫైనల్ గా ఇప్పుడు దీనిపై ఉన్న అంచనాలు వేరు పవన్ కళ్యాణ్ ప్రెజెన్స్ తో భారీ అంచనాలు అందుకున్న ఈ చిత్రం నుంచి చిత్ర యూనిట్ ఈరోజు బిగ్ అప్డేట్ ని అందించారు. మరి అవైటెడ్ గా ఉన్న ఈ చిత్రాన్ని ఇన్ని రోజులు వినిపించిన “బ్రో ది అవతార్” అనే టైటిల్ తో ఫిక్స్ చేసి అనౌన్స్ చేసారు.
అంతే కాకుండా మేకర్స్ అయితే పవన్ కళ్యాణ్ పై స్టన్నింగ్ పోస్టర్ ని రిలీజ్ చేయగా ఇందులో పవన్ ని ఊహించని లెవెల్లో ప్రెజెంట్ చేసారని చెప్పాలి. దివి నుంచి దిగి వచ్చిన దేవుడు స్టైలిష్ గా మారితే ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో పవన్ ని చూపించారు సముద్రఖని.
ఇక త్రివిక్రమ్ కూడా ఇచ్చిన చేంజెస్ బాగా వర్కౌట్ అయ్యేలా కనిపిస్తుండగా ఈ మోషన్ పోస్టర్ లో థమన్ ఇచ్చిన మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. ఇలా ఓవరాల్ గా అయితే అదరగొట్టిన ఈ అప్డేట్ మరిన్ని అంచనాలు పెంచింది అని చెప్పొచ్చు. అయితే ఇందులో డిజప్పాయింటింగ్ అంశం ఏది అంటే ఇది నిజానికి సాయి ధరమ్ తేజ్ సినిమా కానీ పోస్టర్ లో తాను మాత్రం కనిపించలేదు ఇది ఒరిజినల్ తెలిసిన వాళ్ళకి నచ్చకపోవచ్చు.
Working with my Guru @PawanKalyan mama is a BIG BIG DREAM come true.
And now I'm super excited and blessed at this amazing opportunity.
( The fanboy in me is dancing like crazy)Happy to present you all the Title & Motion Poster of our #BroTheAvatar 🤗
– https://t.co/gPRBsIhWZT… pic.twitter.com/ecuPzITz83— Sai Dharam Tej (@IamSaiDharamTej) May 18, 2023