ఓకే ఏడాదిలోనే మూడు విషాదాలు.. మహేష్ బాబు కష్టాలు ఎవరికి రాకూడదు?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మహేష్ బాబుకు ఏడాది ఎంతో విషాదాన్ని నింపిందని చెప్పాలి.ఈ ఏడాది ప్రారంభమైనప్పటి నుంచి ఈయన ఫ్యామిలీలో వరుస విషాదాలు చోటు చేసుకోవడంతో మహేష్ బాబు కుటుంబ సభ్యులు ఎంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మొదట్లో మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు అనారోగ్య సమస్యలతో మరణించడం మహేష్ ఫ్యామిలీని ఎంతగానో కృంగదీసింది.అదే సమయంలో మహేష్ బాబు కోవిడ్ బారిన పడటంతో తన అన్నయ్య చివరి చూపుకు కూడా నోచుకోలేకపోయారు.

ఇక తన అన్నయ్య మరణ వార్త నుంచి మహేష్ బాబు బయటపడక ముందే తన తల్లి ఇందిరా దేవి అనారోగ్య సమస్యతో మరణించారు. మహేష్ బాబుకి తన తల్లి ఇందిరా దేవికి ఎంతో మంచి అనుబంధముందే అయితే ఇందిరా దేవి మరణించడంతో మహేష్ బాబు ఎంతగానో కుమిలిపోయారు.ఇంకా తన తల్లి మరణ వార్త నుంచి బయటపడక ముందే తిరిగి తన తండ్రి కూడా మరణించడం మహేష్ బాబుని మరింత కృంగదీస్తోంది.

ఈ విధంగా తన తండ్రి అనారోగ్య సమస్యతో హాస్పిటల్ లో చేరిన కొన్ని గంటలకే మరణించడంతో మహేష్ బాబు కన్నీరు పెట్టుకున్నారు. ఇలా దెబ్బ మీద దెబ్బ పడుతూ మహేష్ కుటుంబాన్ని విధి ఎమోషనల్ గా ఆడుకుంటుంది. ఇలా ఏడాదిలోనే తల్లి తండ్రితో పాటు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అన్నయ్య కూడా మరణించడం మహేష్ బాబుకి తీరనిలోటు అని చెప్పాలి.ఈ విధంగా మహేష్ బాబు ఇంట్లో వరుస విషాదాలు చోటు చేసుకోవడంతో ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదని అభిమానులు ప్రార్థించడమే కాకుండా ఈ కష్టాలన్నీటిని అధిగమించి మహేష్ బాబు ఎంతో ధైర్యంగా ఉండాలంటూ అభిమానులు తమ హీరోకి ధైర్యం చెబుతూ పోస్టులు చేస్తున్నారు.