NTR : అక్కడ ఫ్యాన్స్ అభిమానం చూసి ఆశ్చర్య పోయిన తారక్….!

NTR: నందమూరి వారసుడు ఎన్టీఆర్ తన ప్రతిభతో తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో తనదయినా స్థానాన్ని సంపాదించుకున్నాడు.ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా తో దేశ వ్యాప్తంగా సినిమా అభిమానులను తన నటన తో ఫిదా చేశారు. సినిమా చుసిన ప్రతి సెలబ్రిటి కూడా ఎన్టీఆర్ నటన గురించి పొగడ్తల వర్షం కురిపించారు. అంతగా ఈ సినిమాలో తన నటన విశ్వ రూపాన్ని చూపించారు. ఇటు సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా అభిమానులను సంపాదించాడు.

బాలీవుడ్ లో ఐతే ఎన్టీఆర్ నటన చూసి అందరు షాక్ కు గురవుతున్నారు.నిజంగానే ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ తన నటనతో అబ్బురపరిచాడు. ఎన్టీఆర్‌ తో పోటీ పడే నటుడే లేడు అన్నట్టు కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో తారక్ నటన అద్భుతంగా ఉంది.భారీ కలెక్షన్ లు సాదిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా సక్సెస్ సాధించడం లో ఎన్టీఆర్ నటన డే ముఖ్య పాత్ర అనడంలో అశ్చర్యం లేదు. కొమరం బీముడో పాటలోని ఎన్టీఆర్ నటనక ప్రేక్షకులను తిరిగి థియేటర్ ల కు రప్పించింది.

ఉత్తరాదిలో ఎన్టీఆర్ కు మరింత ఫాలోయింగ్ పెరిగింది. నిన్న ఎన్టీఆర్ ముంబై వెళ్లారట. ముంబై లో ఓ హోటల్ లో దిగగానే అక్కడ స్థానిక ప్రేక్షకులు ఎన్టీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేసేసారు. ఎన్టీఆర్ తో ఫోటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. జై ఎన్టీఆర్.. జై భీమ్ అని నామజపంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా హోరెత్తిపోయిందట.ఒక బాలీవుడ్ స్టార్ హీరోలకే ఇలా జరుగుతుంది. కానీ.. ఎన్టీఆర్ కి ఇలా జరగడం.. ముఖ్యంగా నార్త్ ప్రేక్షకులు ఎన్టీఆర్ పై అమితమైన అభిమానాన్ని చూపించడం ఎన్టీఆర్ కి కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎన్టీఆర్ ను బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేయాలని హిందీ ప్రేక్షకులు కోరారు.తనకు హిందీలో అద్భుతమైన ఎంట్రీ లభించింది అని.. పైగా ‘ఆర్ఆర్ఆర్’ ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులు తనకు జేజేలు పలుకుతున్నారని.. కచ్చితంగా హిందీలో కూడా ఇక నుంచి వరుస సినిమాలు చేస్తాను అంటూ ఎన్టీఆర్ వాళ్లతో అన్నారట.