ఇప్పుడు పవన్ వంతు.. బోయపాటి శ్రీను క్రేజీ కామెంట్స్..!

టాలీవడో గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పలు భారీ చిత్రాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రాలతో పాటుగా పవన్ కళ్యాణ్ తన రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నాడు. కాగా పవన్ విషయంలో చాలా వరకు అంతా ఎక్కువగా చెప్పే మాట తన సినిమాలు కన్నా వ్యక్తిత్వం వాళ్ళ అభిమానులు అయ్యాము అని చెప్తూ ఉంటారు.

దీనినే నాగబాబు కూడా చాలా సార్లు ప్రస్తావించారు. అయితే రీసెంట్ గా స్కంద చిత్రంతో టాలీవుడ్ లో మిడ్ రేంజ్ హీరోస్ లో ఒక భారీ ఓపెనర్ ని అందించిన దర్శకుడు బోయపాటి శ్రీను కొందరిపై చేసిన క్రేజీ కామెంట్స్ మంచి వైరల్ గా మారాయి. కాగా అందులో తన సంగీత దర్శకుడు థమన్ ఉన్నాడు అలానే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఉన్నాడు. అయితే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంతు వచ్చింది.

మరి తనపై కూడా మాట్లాడుతూ బోయపాటి శ్రీను పలు క్రేజీ కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ ఒకలాంటి మనిషి అని అతనికి ఎలాంటి ఫిల్టర్ లు ఉండవు, ఎవరికైనా సాయం కావాలి అంటే అక్కడ ఖచ్చితంగా నిలబడతాడు. అలాగే అతను చాలా నిజాయితీపరుడు అంటూ కామెంట్స్ చేసారు. దీనితో పవన్ పై ఈ స్టేట్మెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది.