ఎన్టీఆర్, చరణ్ కాదు “ఆస్కార్” లో ఈ ఇద్దరి స్టేజ్ షో.!

ఇండియన్ సినిమా దగ్గర ప్రైడ్ చిత్రంగా నిలిచిన భారీ చిత్రం ట్రిపుల్ ఆర్ (RRR) పేరే వరల్డ్ వైడ్ గా కూడా భారీ మొత్తంలో సెన్సేషన్ గా మారగా ఈ సినిమాలో ఉన్న హిట్ సాంగ్ నాటు నాటు అయితే ఏకంగా వరల్డ్ వైడ్ గా షేక్ చేస్తుంది. కాగా ఈ సాంగ్ ఆస్కార్ కి గాను ఈ ఏడాది నామినేట్ కాగా ఈ సాంగ్ కి అవార్డు ఆల్ మోస్ట్ వచ్చేసినట్టే అనే టాక్ కూడా పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.

కాగా ఈ సాంగ్ విషయంలో అయితే అవార్డు వచ్చినా రాకపోయినా కూడా చిత్ర యూనిట్ అయితే అకాడమీ అవార్డ్స్ కి వెళ్లనున్నారు. మరి ఈ బిగ్గెస్ట్ ఈవెంట్ లో అయితే హీరోలు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల నుంచి లైవ్ గా స్టేజ్ షో అయితే ఈ సాంగ్ కోసం ఉంటుంది అని గట్టి టాక్ వచ్చింది.

కానీ ఈ ఇద్దరు కాకుండా మరో ఇద్దరి స్టేజ్ షో ను ఐతే అరేంజ్ చేసినట్టుగా స్వయంగా అకాడమీ వారే ఆ బిగ్గెస్ట్ అనౌన్సమెంట్ ని అందించడం వైరల్ గా మారింది. కాగా ఈ 95 వ ఆస్కార్ అవార్డ్స్ వేడుక ఈ మార్చ్ 12న జరగనుండగా అక్కడ లైవ్ గా ఈ సాంగ్ ఒరిజినల్ గా తెలుగులో పాట పాడిన సింగర్స్ కాల భైరవ మరియు రాహుల్ సిప్లిగంజ్ ల ద్వయం అయితే పాడనున్నట్టుగా అనౌన్స్ చేశారు.

దీనితో అకాడమీ నుంచే ఈ ఊహించని అప్డేట్ రావడం మన తెలుగు సినిమాకి మరో గర్వకారణంగా నిలిచింది. కాగా ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ లో అయితే హీరోలు సహా దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి అలాగే రచయిత చంద్రబోస్ లు హాజరు కానున్నారు.