మునపటి ఉత్సాహం ఎవ్వరిలోనూ కనపించడం లేదు.. బిగ్ బి ఎమోషనల్ పోస్ట్?

భారతీయ సినీ చరిత్రలో హీరోగా చెరగని ముద్ర వేసుకున్న అమితాబచ్చన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో దశాబ్దాల కాలంగా కొన్ని వందలకు పైగా సినిమాలలో నటించిన అమితాబచ్చన్ చిన్న స్థాయి నుండి అంచలంచలుగా ఎదుగుతూ అగ్ర శిఖరానికి చేరుకొని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. వయసు పైబడిన తర్వాత కూడా వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. సినిమాలలో నటించడమే కాకుండా టీవీ షోలలో వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల అమితాబచ్చన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది.

తన జీవితంలో చూస్తున్న మార్పులకు సంబంధించిన విషయాల గురించి సోషల్ మీడియా వేదికగా అమితాబచ్చన్ తన అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలో తన పర్సనల్‌ బ్లాగ్‌లో ఫిలసాఫికల్‌ నోట్‌ను పోస్ట్‌ చేశారు . గతంలో ప్రతి ఆదివారం మండల సంఖ్యలో అభిమానులు తనని కలవడానికి జల్సా వద్దకు వచ్చేవారని ఈ సందర్భంగా వెల్లడించాడు. కానీ ప్రస్తుతం ఆ సంఖ్య పూర్తిగా తగ్గిపోయిందని తన బాధను వెల్లడించాడు.ఒకప్పుడు అభిమానులు వేసే కేరింతలు ఇళ్లలతో ఎంతో ఉత్సాహంగా ఉండేదని కానీ ప్రస్తుతం మొబైల్ ఫోన్లలో ఫోటోలు తీసుకుని దృశ్యాలు మాత్రమే కనిపిస్తున్నాయని విచారం వ్యక్తం చేశాడు.

అమితాబచ్చన్ ఎన్నో ఏళ్ల నుండి సండే మీట్స్ పేరుతో వందల సంఖ్యలో అభిమానుల్ని కలిసేవాడు. కానీ రోజులు మారేకొద్ది తనని కలవడానికి వచ్చే అభిమానుల సంఖ్య రోజుకి తగ్గుతుందని ఈ సందర్భంగా వెల్లడించాడు. మునుపటిలా అభిమానుల్లో ఉత్సాహం లేదని.. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాల్సిన పరిస్థితిలో ఏర్పడుతున్నాయని ఈ సందర్భంగా వెల్లడించాడు. ఈ పరిణామాలను గమనిస్తుంటే ఏది శాశ్వతం కాదని బోధపడుతుంది. సమయం మనకోసం ఆగదని విషయం అర్థమైంది అంటూ తనదైన శైలిలో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. అమితాబచ్చన్ షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.