సన్నీ లియోన్‌ మనసుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు!

‘అనుష్క మిస్‌ అయ్యింది.. ఆమెను వెతకడంలో సాయం చేయండి’ అంటూ సన్నీలియోన్‌ ఇన్‌ స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్‌ ఎంతగా వైరల్‌ అయిందో తెలిసిందే! కనిపించకుండాపోయిన తన పనిమనిషి కుమార్తె అనుష్క గురించి ఆమె పెట్టిన పోస్ట్‌ ఇది. ‘తొమ్మిదేళ్ల వయసున్న అనుష్క జోగేశ్వరి వెస్ట్‌ బెహ్రామ్‌ బాగ్‌లో నవంబర్‌ 8న సాయ్రంతం మిస్‌ అయింది. పాప తల్లిదండ్రుల ఆవేదన చూస్తుంటే నాకెంతో బాధగా ఉంది. ఆమెను వెతికి తీసుకొచ్చిన వారికి రూ.50000 నగదు విరాళం ఇస్తాను’ అని సన్నీలియోన్‌ తన పోస్ట్‌లో వెల్లడించారు. అంతే కాదు ముంబయి పోలీస్‌ విభాగానికి కూడా ట్యాగ్‌ చేశారు. ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

బాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు.. ఆమె పోస్ట్‌ను వైరల్‌ చేశారు. తాజాగా ‘అనుష్క దొరికింది’ అంటూ సన్నీ మరో పోస్ట్‌ చేశారు. తప్పిపోయిన పాపను వెతకడంలో సాయం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ‘మన ప్రార్థనలకు సమాధానం దొరికింది! ఆ కుటుంబానికి భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి.

ముంబయి పోలీసులకు థ్యాంక్యూ. 24 గంటల్లోనే అనుష్క తిరిగి మా వద్దకు చేరింది. ఆమె కోసం నేను పెట్టిన పోస్ట్‌ను షేర్‌ చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు’’ అని ఆమె పేర్కొన్నారు. తన ఇంట్లో పనిచేసే వ్యక్తి బిడ్డ మిస్‌ అయిందని, ఆమెను వెతికి పట్టుకోవడానికి సన్నీ లియోన్‌ పడిన తపన చూసి ఆమె మంచి మనసుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.