ముదురుతున్న సరోగసి వ్యవహారం… స్పందించిన నయనతార దంపతులు?

నయనతార దర్శకుడు విగ్నేష్ ను పెళ్లి చేసుకున్న తర్వాత వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే వీరి వివాహం జరిగిన నాలుగు సంవత్సరాలకి వీరికి ఇద్దరు మగ కవల పిల్లలు జన్మించారని పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం పలు చర్చలకు దారి తీసింది.ఈ పోస్ట్ చూసినటువంటి అభిమానులు అసలు పెళ్లైన నాలుగు నెలలకే పిల్లలు పుట్టడం ఎలా సాధ్యమవుతుంది ఇదివరకు నయనతారని ప్రెగ్నెంట్ గా కూడా ఎప్పుడూ చూడలేదు అంటూ కామెంట్ చేశారు.అయితే వీరిద్దరూ పెళ్లికి ముందే సరోగసి విధానం ద్వారా పిల్లలను ప్లాన్ చేశారని స్పష్టంగా అర్థం అవుతుంది.

ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఈ దంపతులు ఎన్నో వివాదాలను నెగిటివ్ కామెంట్లను ఎదుర్కొంటూ ఉన్నారు.ఈ క్రమంలోనే ఈ విషయంపై ఏకంగా తమిళనాడు వైద్య ఆరోగ్యశాఖ కూడా స్పందించి పిల్లల విషయంపై తమకు క్లారిటీ కావాలని వీరికి నోటీసులు జారీ చేసి ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేసింది. ఇకపోతే ఈ విషయంపై తాజాగా నయనతార దంపతులు స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.

ఈ క్రమంలోనే విగ్నేష్ శివన్ స్పందిస్తూ అన్ని విషయాలు త్వరలోనే తెలుస్తాయి.. కాస్త ఓపిక పట్టండి. ఎప్పుడు కృతజ్ఞతతో ఉండండి అలాగే మిమ్మల్ని నమ్మేవారు మీ గురించి ఆలోచించే వారిని ఎప్పుడు నమ్మండి అంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన మీడియాలో వైరల్ గా మారింది.ఇలా ఈ సందర్భంగా ఈయన పరోక్షంగా ఈ విషయంపై స్పందించారు కానీ సరోగసి విధానం గురించి ఎక్కడ ప్రస్తావించలేదు.ఇక ప్రస్తుతం ఈయన షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇకపోతే హీరో కార్తీ ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ వెల్కమ్ టు పేరెంట్ హుడ్ మీపై మీ పిల్లలపై భగవంతుడి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలి అంటూ ఈయన శుభాకాంక్షలు తెలియజేశారు.