సినిమాల విషయంలో షాకింగ్ డెసిషన్ తీసుకున్న నయనతార?

లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లి తరువాత కూడా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఈమె షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాలో నటిస్తున్నారు. అదేవిధంగా మాధవన్ హీరోగా నటించబోయే సినిమాలో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విధంగా పలు సినిమాలతో బిజీగా ఉన్నటువంటి నయనతార సినిమాల విషయంలో అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ రెండు సినిమాలను పూర్తి చేసిన తర్వాత ఈమె సినిమాలకు విరామం ప్రకటించాలని భావించారట.

ఈ విధంగా నయనతార ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఓ కారణం ఉంది పెళ్లికి ముందు పెళ్లి తర్వాత నయనతార వరుస వివాదాలను ఎదుర్కొంటూ ఎంతో సతమతమయ్యారు. ఈ క్రమంలోనే ఈ వివాదాలన్నింటికీ కాస్త దూరంగా ఉండి తన భర్త పిల్లలతో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని భావించారట.అందుకే ఈ సినిమాలు పూర్తి కాగానే ఈమె ఇతర సినిమాలకు కమిట్ కాకుండా పూర్తిగా తన సమయాన్ని తన పిల్లలకు కేటాయించి పిల్లలతో సంతోషంగా ఉండాలని భావించారని సమాచారం.

ఇక నయనతార గత ఏడు సంవత్సరాలుగా డైరెక్టర్ విగ్నేష్ తోప్రేమలో ఉన్నటువంటి ఈమె ఈ ఏడాది జూన్ నెలలో వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లి జరిగిన నాలుగు నెలలకే ఈమె సరోగసి విధానం ద్వారా తల్లి కావడంతో ఇద్దరు కవల పిల్లలకు తల్లి అయ్యారు. తమ జీవితంలోకి పిల్లలు కూడా రావడంతో తన సమయాన్ని వారితో కేటాయించలేకపోతున్నారట అందుకే సినిమాలకు కొన్ని రోజులు స్వస్తి పలికి తన విలువైన సమయాన్ని తన పిల్లల కోసం కేటాయించనున్నట్లు తెలుస్తోంది.