కవల మగ పిల్లలకు జన్మనిచ్చిన నయనతార.. వైరల్ అవుతున్న ఫోటోలు?

నయనతార విగ్నేష్ దంపతుల వివాహం జరిగి నాలుగు నెలలు అవుతున్నప్పటికీ ఈ జంట తల్లిదండ్రులుగా మారడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. జూన్ 9వ తేదీ వివాహం చేసుకున్న ఈ జంట అక్టోబర్ 9వ తేదీకి పండంటి మగ కవల పిల్లలకు జన్మనివ్వడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఇలా ఈ జంట తల్లిదండ్రులయ్యామంటు వారి పిల్లల పాదాలను ముద్దాడుతూ ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ ఫోటోలు చూసిన ఎంతోమంది అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. పెళ్లయిన నాలుగు నెలలకే తల్లిదండ్రులు కావడం ఏంటి నయనతార ప్రెగ్నెంట్ అయిన దాఖలాలు కూడా లేవు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఈ జంట పెళ్లికి ముందే పిల్లలను ప్లాన్ చేశారని, సరోగసి పద్ధతి ద్వారా పిల్లలను కన్నారని అర్థమవుతుంది. ఈ క్రమంలోనే పెళ్లికి ముందే పిల్లలను ప్లాన్ చేసిన ఈ జంట తల్లిదండ్రులుగా మారిపోయారు.

ఇక ఈ విషయాన్ని విగ్నేష్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నయనతార తాను తల్లిదండ్రులమయ్యామని, భగవంతుడి ఆశీస్సులు మా పూర్వీకుల ఆశీర్వాదం వల్ల తమకు ఇద్దరు మగ కవల పిల్లలు జన్మించారని తెలిపారు. మా పిల్లలకు మీ అందరి ప్రేమ ఆశీర్వాదాలు కావాలని తెలిపారు. ఇక పిల్లలకు జన్మనివ్వడంతో నయనతార కూడా ఎంతో సంతోషంగా ఉన్నారని విగ్నేష్ ఈ సందర్భంగా తన పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది సెలబ్రిటీలు అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.