Nayantara : నయనతార పెళ్లి అయిపోయిందా.. వైరల్ అవుతున్న వీడియో..!

Nayantara: లేడీ సూపర్ స్టార్ గా తమిళ్,తెలుగు భాషల్లో తనదైన నటనతో అలరిస్తున్న హీరోయిన్ నయనతార. విభిన్నమైన పాత్రలతో అభిమానులలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.ఈ మధ్యనే “అన్నాతె” సినిమాలో కనిపించిన నయనతార తాజాగా ఇప్పుడు “కాతు వాకుల రెండు కాదల్” సినిమాలో విజయ్ సేతుపతి సరసన నటిస్తోంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో కూడా నటిస్తోంది.

గత కొంత కాలంగా డైరెక్టర్ విగ్నేష్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసినదే.’నానూ రౌడీదాన్‌’ సినిమా షూటింగ్‌ సమయంలో లవ్‌లో పడ్డ ఈ జోడి.. అప్పటి నుంచి పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారు.లాక్‌డౌన్‌లో సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట,నిశ్చితార్థం రహస్యంగా చేసుకున్నా.. లాక్‌డౌన్‌ అనంతరం పెళ్లి మాత్రం ఘనంగా చేసుకుంటామని పలు ఇంటర్వ్యూలలో నయన్, విఘ్నేశ్‌ సమాధానం ఇచ్చారు.

అభిమానులు వీరి పెళ్లి కి సంబంధించిన వార్త కోసం ఎదురుచూస్తుండగా, ఇప్పుడు ఏకంగా వీరిద్దరికి పెళ్లి కూడా ఐపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. లాక్‌డౌన్‌ ఎత్తివేసినప్పటి నుంచి నయనతార, విఘ్నేశ్‌ శివన్‌లు జంటగా దేశంలోని ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తమిళనాడులోని ఓ అమ్మావారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయించుకున్నారు.

పూజ అనంతరం వారు దేవాలయ సిబ్బంది తో ఫోటోలు దిగారు.దీనికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానికి కారణం ఆ వీడియోలో నయనతార నుదిటిపై సింధురం ఉండటం. అంటే వీరిద్దరికీ పెళ్లి అయిపోయిందా అంటూ నెటిజన్లు ఆ వీడియో కింద కామెంట్లు చేస్తున్నారు. దీని గురించి అధికారికంగా ప్రకటన ఎప్పుడు విలువడుతుందో, దీని గురించి ఎలా స్పందిస్తారో చూడాలి.