ఆ సమయంలో అందరూ దూరం పెట్టారు.. ‘ఆమె కథ’ నవ్యస్వామి కన్నీటిగాథ

బుల్లితెర హీరోయిన్ నవ్యస్వామి గురించి అందరికీ తెలిసిందే. ఆమె ఈ మధ్య వార్తల్లో తెగ నిలుస్తోంది.ఆమె కథ సీరియల్‌లో ఫీమేల్ లీడ్‌గా నవ్య స్వామి బాగానే పాపులర్ అవుతోంది. అంతకు ముందు కూడా కొన్ని సీరియల్లో నటించింది. కానీ ఆమె కథ బాగా పాపులర్ అయ్యేలా చేసింది. నవ్యస్వామికి కరోనా వచ్చిన సమయంలో ఆమె పేరు ఓ రేంజ్‌లో వైరల్ అయింది. అప్పుడప్పుడే షూటింగ్‌లకు అనుమతులు లభించాయి.

Navya Swamy ABout Corona In Jatharo Jathara Event
Navya Swamy ABout Corona In Jatharo Jathara Event

మొదటగా బుల్లితెర షూటింగ్‌లు మొదలయ్యాయి. అయితే ఆ సమయంలో కరోనా విజృంభణ కూడా ఓ రేంజ్‌లో ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఓ రేంజ్‌లో విస్తరించింది. అలాంటి సమయంలో బుల్లితెర షూటింగ్‌లు జరిగాయి. దాని వల్ల కొంతమంది కరోనా బారిన పడ్డారు. అందులో నవ్యస్వామి కూడా ఉంది. ఇక ఆమెకు కరోనా వచ్చి వార్తలు మీడియాలో తెగ వైరల్ అయింది. తనకు కరోనా వచ్చినా కూడా అంతగా బాధ పడలేదని, కానీ మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను చూసి చాలా బాధపడ్డానని ఆ మధ్య చెప్పుకొచ్చింది.

Navya Swamy ABout Corona In Jatharo Jathara Event
Navya Swamy ABout Corona In Jatharo Jathara Event

అంతే కాకుండా కరోనా తగ్గిన తరువాత కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెబుతూ.. ఓ వీడియోను కూడా రిలీజ్ చేసింది. కరోనా వస్తే భయపడాల్సిన అవసరమేమీ లేదని, ధైర్యంగా ఉండాలని ఆ వీడియోలో చెప్పింది. తాజాగా నవ్యస్వామి నాటి రోజులను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయింది. కరోనా పాజిటివ్ అని తేలిన తరువాత అందరూ తనను బాయ్ కాట్ చేశారట.. లైఫ్‌లో మొదటి సారి చాలా బాధపడ్డాను ఏడ్చాను అని చెప్పుకొచ్చింది.