నంద‌మూరి హీరోల మ‌ల్టీ స్టార‌ర్.. ఆనందంతో ఎగిరి గంతేసిన ఫ్యాన్స్

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మ‌ల్టీ స్టార‌ర్ ట్రెండ్ ఎక్కువ‌గా న‌డుస్తుంది. మ‌హేష్-వెంక‌టేష్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు, ప‌వ‌న్ క‌ళ్యాణ్-వెంకీ కాంబినేష‌న్ లో వ‌చ్చిన గోపాల గోపాల‌, నాగార్జున‌- కార్తీ ప్రధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన ఊపిరి, వ‌రుణ్ తేజ్‌- వెంకీ హీరోలుగా వ‌చ్చిన ఎఫ్‌2 చిత్రాలు మంచి విజ‌యాలు సాధించ‌డంతో మేక‌ర్స్ కూడా స‌రికొత్త జాన‌ర్‌లో మ‌ల్టీ స్టార‌ర్‌లు తెరకెక్కించేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నారు.

తాజాగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న భారీ బ‌డ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ పై కూడా బోలెడ‌న్ని అంచనాలు ఉన్నాయి. ఇప్ప‌టికే చిత్రాల‌కు సంబంధించి విడుదలైన వీడియోలు సినిమాపై భారీ ఆస‌క్తిని క‌లిగించాయి. క‌ట్ చేస్తే ఇప్పుడు నంద‌మూరి హీరోల కాంబినేష‌న్‌లో ఓ మ‌ల్టీ స్టార‌ర్ రూపొంద‌నుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. నంద‌మూరి ఫ్యామిలీ నుండి వ‌చ్చిన తార‌క‌ర‌త్న హీరోగా తెరంగేట్రం చేశారు. మ‌నోడికి పెద్ద‌గా స‌క్సెస్ ల రాక‌పోవ‌డంతో ప్ర‌స్తుతం నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌ల‌ని ఎక్కువ‌గా చేస్తున్నాడు. ఇప్పుడు బాల‌య్య- బోయ‌పాటి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న బీబీ3 చిత్రంలోను తార‌క‌ర‌త్న న‌టించ‌నున్నాడు అనే ప్ర‌చారం జ‌రుగుతుంది.

బీబీ 3 చిత్రంలో తార‌క‌ర‌త్న యంగ్ ఎమ్మెల్యే గా క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తుంది. ఈ పాత్ర కాస్త నెగెటివ్ షేడ్‌లో ఉంటుంద‌ని అంటున్నారు. బాల‌కృష్ణ‌, తార‌క‌ర‌త్న‌ల మ‌ధ్య వ‌చ్చే కొన్ని సీన్స్ నంద‌మూరి అభిమానుల‌లో జోష్ పెంచ‌డం ఖాయం అని చెప్పుకొస్తున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. కాగా, సింహా,లెజెండ్ చిత్రాల త‌ర్వాత బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శీను కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ మూవీపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి