ఈ డైరెక్టర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన నాగ చైతన్య.!

టాలీవుడ్ యంగ్ హీరోస్ లో ఒకరైన అక్కినేని నాగ చైతన్య ఇది వరకు ఏ విషయంలో అయినా కూడా చాలా కామ్ గా కూల్ గా కనిపించేవాడు. కానీ ఇపుడు అయితే చైతన్య కాస్త ఓపెన్ గా పలు సాలిడ్ స్టేట్మెంట్స్ ని అందివ్వడం అనేది సినీ వర్గాల్లో మారింది.

కాగా లేటెస్ట్ గా అయితే నాగ చైతన్య ఓ దర్శకుని విషయంలో చేసిన కామెంట్స్ ఇపుడు టాలీవుడ్ ఫ్యాన్స్ లో అలాగే నెటిజన్స్ లో కూడా ఒకింత షాకింగ్ గా మారాయి. ఇంతకీ ఆ దర్శకుడ్ ఎవరో కూడా కాదు. సూపర్ స్టార్ మహేష్ బాబు తో సర్కారు వారి పాట, యంగ్ హీరో విజయ్ దేవరకొండ తో భారీ హిట్ “గోవిందం” చేసిన దర్శకుడు పరశురామ్ పెట్ల అట.

మరి ఈ దర్శకుని టాపిక్ కూడా తన దగ్గర తేవొద్దని చెప్పేసాడు. అతని వల్ల నాకు చాలా టైం వేస్ట్ అయ్యిపోయింది అని అతని గురించి మాట్లాడినా ఆ టైం వేస్ట్ అవుతుందని షాకింగ్ కామెంట్స్ తాను చేసాడు. దీనితో ఎప్పుడూ ఈ రీతిలో కామెంట్స్ చేయని చైతు ఈ తరహాలో షాకింగ్ కామెంట్స్ అది కూడా ఓ దర్శకుని విషయంలో చేయడం ఊహించనిది అని చెప్పాలి.

కాగా ఇదే దర్శకుడు అయితే కొందరు నిర్మాతలతో కూడా ఇదే తంతు నడుస్తుంది అని టాక్ ఉంది. అందుకే చైతన్య మాత్రం ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చేసారు. ఇక ఇప్పుడు అయితే నాగ చైతన్య తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తో ఇంట్రెస్టింగ్ వింటేజ్ డ్రామా “కస్టడీ” చేయగా ఈ సినిమా ప్రమోషన్స్ లో చైతన్య ఈ రకంగా మాట్లాడ్డం జరిగింది. కాగా ఈ సినిమా ఈ మే 12న తెలుగు తమిళ్ లో ఒకేసారి రిలీజ్ కానుంది.