‘మనం’ మళ్లీనా.? అప్పుడే వద్దంటోన్న నాగ్.!

అక్కినేని ఫ్యామిలీ మూవీగా ‘మనం’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకి సీక్వెల్ తీయాలంటూ చాలా కాలంగా అనుకుంటున్నారు. ఈ మధ్య అక్కినేని హీరోలకు అంతగా కలిసి రావడం లేదు. దాంతో, ‘మనం’ సీక్వెల్ తాజాగా చర్చల్లోకి వచ్చింది. ఈ సినిమాకి సీక్వెల్ చేస్తే ఎలా వుంటుంది.? అని చైతూ సన్నిహితులు అంటున్నారట.

అయితే, నాగార్జున ఇప్పుడప్పుడే వద్దంటున్నాడట. నాగ చైతన్య, నాగార్జున కలిసి ఓ ప్రాజెక్ట్ చేయాలని కొందరు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారట. ఆ క్రమంలోనే ‘మనం’ సినిమా సీక్వెల్ అయితే బాగుంటుందని భావిస్తున్నారట.

కానీ, నాగార్జున మాత్రం ఇప్పుడప్పుడే ఆ ప్రాజెక్ట్ టచ్ చేయొద్దని సూచిస్తున్నాడట. చూడాలి మరి, ఏం జరుగుతుందో. అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రం, అఖిల్ తొలి చిత్రంగా ‘మనం’ మంచి విజయం అందుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాతే సమంత అక్కినేని వారి కోడలైంది కూడా. ఇలా అక్కినేని ఫ్యామిలీకి ఓ బ్యూటిఫుల్ మెమరీ ‘మనం’ ప్రాజెక్ట్.