తమిళ దర్శకుడితో మెగాస్టార్ .. త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ ..?

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య అన్న సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మెగా పవర్ స్టార్ రాం చరణ్, నిరంజన్ రెడ్డి .. కొణిదెల ప్రొడక్షన్స్ – మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రెజీనా స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుంది. మణిశర్మ సంగీతమందిస్తున్నాడు లాక్ డౌన్ తర్వాత రీసెంట్ గా సెట్స్ మీదకి వచ్చిన ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. త్వరలో మెగాస్టార్ కూడా ఆచార్య సెట్ లో జాయిన్ కాబోతుండగా ఈ సినిమాలో విలన్ గా అరవింద స్వామీ ని నటింపచేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం.

Chiranjeevi speaks about Charan's role in Acharya; his remakes - tollywood

ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ మెహర్ రమేష్ దర్శకత్వం లో తమిళ సూపర్ హిట్ వేదాలం రీమేక్ లో నటించబోతున్నాడు. తమిళంలో అజిత్ నటించిన ఈ సినిమా మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. దాంతో మెగాస్టార్ ఇమేజ్ కి ఈ సినిమా పర్ఫెక్ట్ గా సూటవుతుందన్న కారణంగా ఈ సినిమా రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నారు. కాగా ప్రస్తుతం మెహర్ రమేష్ ఈ సినిమా స్క్రిప్ట్ లో కొన్ని కీలక మార్పులు, చేర్పులు చేస్తున్నాడట.

అయితే గత కొన్ని రోజులుగా మెగాస్టార్ నటించబోతున్న మరో రీమేక్ సినిమాకి సంబంధించి చాలా రకాల వార్తలు వస్తున్నాయి. లూసీఫర్ రీమేక్ లో నటించబోతున్నట్టు మెగాస్టార్ వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాకి ముందు దర్శకుడిగా సుజీత్ ని అనుకున్నారు. ఆ తర్వాత వి.వి.వినాయక్ దర్శకుడిగా ప్రాజెక్ట్ లోకి వచ్చాడు. అయితే వినాయక్ చేసిన మార్పులు మెగాస్టార్ ని మెప్పించలేదని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి తమిళ దర్శకుడి పేరు పరిశీలిస్తున్నట్టు సమాచారం.

తమిళంలో ‘తనిఒరువన్‌’ సినిమా తెరకెక్కించి సూపర్ హిట్ ఇచ్చాడు దర్శకుడు మోహన్ రాజా. ఈ సినిమానే తెలుగులో రాం చరణ్ ధృవ గా రిమేక్ చేశారు. అయితే ఇప్పుడు లూసీఫర్ తెలుగు రీమేక్ కి దర్శకుడిగా మోహన్ రాజా అయితే బావుంటుందని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో అఫీషియల్ గా కన్‌ఫర్మేషన్ వస్తే గాని తెలీదు.