లేటెస్ట్ పోస్ట్ తో అందరికీ షాకిచ్చిన చిరంజీవి.!

గత కొన్ని రోజులు నుంచి కూడా మెగా ఫ్యాన్స్ లో ఓ కలవరం నెలకొన్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఆరాధించే ప్రముఖ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ మీటింగ్ లో నన్నెవడు స్టార్ హీరో చేయలేదు అన్నీ నేనే సంపాదించుకున్న అని చెప్పిన మాట అందరికీ షాక్ ఇచ్చింది.

దీనితో మెగాస్టార్ మరియు రామ్ చరణ్ అభిమానులు పవన్ ని విమర్శించారు. అయితే ఈ విషయంలో మెగా ఫామిలీ లో దూరం తెస్తుంది. చిరు పవన్ తో మాట్లాడాడు దూరం పెడతాడు లాంటి చాలానే సందేహాలు వచ్చేసాయి. కానీ లేటెస్ట్ గా అయితే ఈ మాటలు కామెంట్స్ అన్నిటికి కూడా మెగాస్టార్ చెక్ పెట్టేసారు.

ఈ మాతృ దినోత్సవం సందర్భంగా తన తల్లి అంజనమ్మతో ముగ్గురు అన్నతమ్ములు కలిసి ఉన్న పిక్స్ షేర్ చేసి అందరికీ షాకిచ్చారు. దీనితో మెగా ఫ్యామిలీ విడిపోవడం అనేది జరగదు అని ఎన్ని అయ్యినా కూడా వారు ఎప్పటికీ కలిసే ఉంటారు అని అయితే ఈ పోస్ట్ తో కన్ఫర్మ్ అయ్యిపోయింది.

కాగా మెగాస్టార్ అయితే “అనురాగం,  మమకారం… ఈ రెండిటికి అర్ధమే అమ్మ … అమ్మ నవ్వు చూస్తే అన్ని మర్చిపోతాం. నిరాడంబరంగా ఉండటం మేమందరం అమ్మ ని చూసే నేర్చుకున్నాం. అమ్మలందరికి మథర్స్ డే శుభాకాంక్షలు” అంటూ బ్యూటిఫుల్ పోస్ట్ అయితే చేశారు. దీనితో తన లేటెస్ట్ పోస్ట్ వైరల్ గా మారింది. ఇక మెగాస్టార్ అయితే లేటెస్ట్ గా దర్శకుడు మెహ రమేష్ తో “భోళా శంకర్” సినిమాలో బిజీగా ఉన్నారు.