మాస్ మహా రాజ్ “ఈగల్” రాకపై మాసివ్ అప్డేట్..!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ చిత్రం “టైగర్ నాగేశ్వర రావు” ఇప్పుడు విడుదలకి సిద్ధం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్రం రిలీజ్ కి దగ్గరకి వస్తుండగా మేకర్స్ కూడా ఫుల్ బిజీగా ప్రమోషన్స్ హైప్ ఎక్కించే పనిలో ఉన్నారు. కాగా ఈ సినిమా తర్వాత రవితేజ చేస్తున్న మరో భారీ చిత్రమే “ఈగల్”.

దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని అనే మరో కొత్త యంగ్ దర్శకునికి అవకాశం ఇచ్చిన మాస్ మహారాజ్ ఇప్పుడు ఈ సినిమాని కూడా భారీ ఏక్షన్ ఎంటర్టైనర్ గా చేస్తున్నాడు. మరి ఈ సినిమాని ఇప్పటికే వచ్చే ఏడాది సంక్రాంతి రిలీజ్ అని ఫిక్స్ చేశారు. ఇక ఇప్పుడు అయితే ఈ సినిమాపై మేకర్స్ మాసివ్ అప్డేట్ ని అందించారు.

మరి ఈ చిత్రాన్ని అయితే వచ్చే ఏడాది జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీనితో అయితే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో మరో సినిమా లాక్ అయ్యిపోయింది అని చెప్పాలి. ఇప్పటికే చిత్రాలు హనుమాన్ అలానే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మాస్ డ్రామా గుంటూరు కారం చిత్రాలు జనవరి 12న అని లాక్ చేసుకున్నారు.

మరి ఇప్పుడు వీటి తర్వాత రోజే రవితేజ ఈగల్ లాక్ అయ్యింది. ఇక మొగత సినిమాల పరిస్థితి ఏంటో చూడాలి. ఆల్రెడీ ఈ రేస్ లోనే విజయ్ దేవరకొండ పరశురామ్ పెట్ల ల రెండో సినిమా కూడా ఉందని కన్ఫర్మ్ చేశారు. ఈ డేట్ ఇంకా అనౌన్స్ కావాల్సి ఉంది.