అల్లు అర్జున్ మరో సెన్సేషనల్ పాన్ ఇండియా ప్రాజెక్ట్.!

తెలుగు ఇండస్ట్రీ నుంచి అయితే ఎలాంటి రాజమౌళి లేకుండా పాన్ ఇండియా లెవెల్లో భారీ పాపులారిటీ తెచ్చుకున్న ఏకైక హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనే చెప్పుకోవాలి. అప్పటి వరకు తనకు ఉన్నది స్మాల్ క్రేజ్ మాత్రమేనా లేక టికెట్ పెట్టి హిందీలో కూడా సినిమా చూస్తారా లేదా అనేది పుష్ప తో అల్లు అర్జున్ క్లియర్ చేసుకున్నాడు.

దీనితో ఈ భారీ ప్రాజెక్ట్ సీక్వెల్ కోసం అనేక మంది ఎదురు చూస్తున్నారు. మరి ఇదిలా ఉండగా ఈ భారీ సినిమా తర్వాత అయితే అల్లు అర్జున్ ఇమీడియేట్ ప్రాజెక్ట్ గా ఓ భారీ సెన్సేషనల్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇప్పుడు అనౌన్స్ చేశారు. ఈ సినిమాని అర్జున్ రెడ్డి ఫేమ్ ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్ గా మారిపోయిన మన తెలుగు దర్శకుడు సందీప్ వంగ తెరకెక్కించనుండడం విశేషం.

ఇప్పుడు ఈ దర్శకుడు హిందీలో “యానిమల్” అనే క్రేజీ ప్రాజెక్ట్ చేస్తుండగా నెక్స్ట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మరో మాసివ్ ప్రాజెక్ట్ “స్పిరిట్” అనే ఇంట్రెస్టింగ్ పాన్ ఆసియ లెవెల్ సినిమా చేయనున్నారు. వీటి తర్వాత అల్లు అర్జున్ తో క్రేజీ ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు అనౌన్స్ చేశారు.

మరి ఈ మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్ లో ఎలా ఉంటుందో చూడాల్సిందే. కాగా ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ని బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ టి సిరీస్ వారు నిర్మాణం వహించనుండగా ఇతర డీటెయిల్స్ ఇంకా బయటకి రావాల్సి ఉన్నాయి. ఇక ఈ భారీ నిర్మాణ సంస్థ నుంచి అయితే ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా రిలీజ్ కి సిద్ధం గా ఉంది.