సమంతతో పెళ్లి ఫిక్స్!

టాలీవుడ్ బడా నిర్మాతగా తనకంటూ గుర్తింపుని డివివి దానయ్య సొంతం చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా ప్రొడ్యూసర్ గా తన బ్రాండ్ ని మరింతగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ప్రస్తుతం దానయ్య సుజిత్ దర్శకత్వం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఓజీ మూవీని నిర్మిస్తున్నారు. ఇక దానయ్య నిర్మిస్తున్న సినిమాలని అతని తనయుడు దాసరి కళ్యాణ్ చూసుకుంటున్నారు.

ఆర్ఆర్ఆర్ మూవీతో దాసరి కళ్యాణ్ నటుడిగా కూడా పరిచయం అయ్యాడు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అధీరా మూవీతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కనున్న ఈ సినిమాని డివివి దానయ్య నిర్మించబోతున్నాడు. ప్రశాంత్ వర్మ సూపర్ హీరో యూనివర్స్ నుంచి హనుమాన్ తర్వాత ఈ సినిమా రానుంది.

ఇక ఈ యువ నటుడు, నిర్మాత హీరోగా ఇంకా పరిచయం కాకుండానే పెళ్లికొడుకు కాబోతున్నారు. తన ప్రియురాలు సమంత రెడ్డితో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. మే 20న అతని పెళ్లి జరగనుంది. పెళ్లి తర్వాత మరల ఓజీ మూవీ ప్రొడక్షన్ పనులలో అతను బిజీ అవ్వబోతున్నాడు. పెళ్లి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో జరగనుంది.

అయితే రిసెప్షన్ మాత్రం చాలా గ్రాండ్ గా నిర్వహించనున్నారు. తెలుగు సినీ సెలబ్రిటీ ప్రముఖులు అందరూ కూడా ఈ వేడుకకి హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే తెలుగు రాష్ట్రాలకి చెందిన రాజకీయ నాయకులు కూడా అటెండ్ అవ్వొచ్చు అని అంచనా వేస్తున్నారు. ఈ పెళ్లి వేడుక నేపథ్యంలో ఓజీ మూవీ షూటింగ్ షెడ్యూల్ కి కొంత గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇక డివివి దానయ్య తనయుడుని ఆర్ఆర్ఆర్ మూవీతో నిర్మాతగా పరిచయం చేశాడు. ఇప్పుడు ఓజీ మూవీకి కూడా కంప్లీట్ గా ప్రొడక్షన్ అంతా అతనే హ్యాండిల్ చేస్తున్నాడు. మొత్తానికి యువ నిర్మాత, నటుడు అయిన దాసరి కళ్యాణ్ పెళ్లి ఇప్పుడు టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళి, తారక్, రామ్ చరణ్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్స్ అందరూ కూడా ఈ పెళ్లి వేడుకకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.