“వాల్తేరు వీరయ్య” నెక్స్ట్ సాంగ్ పై లేటెస్ట్ డీటెయిల్స్.!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మాస్ మసాలా చిత్రం “వాల్తేరు వీరయ్య”. మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అయితే మెగా ఫ్యాన్స్ చాలా అంచనాలు పెట్టుకోగా ఇప్పటి వరకు ఇచ్చిన అప్డేట్స్ లో దేనితో కూడా బాబీ నిరాశపరచలేదు.

ఇక ఈ చిత్రం నుంచి అయితే లేటెస్ట్ గా వచ్చిన ఫస్ట్ సింగిల్ బాస్ పార్టీ 20 మిలియన్ వ్యూస్ తో ఇంకా యూట్యూబ్ లో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతూ ఉండగా ఇప్పుడు రెండో పాట అనౌన్సమెంట్ కి కూడా రంగం సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తుంది.

మరి రెండో సాంగ్ ని అయితే చాలా కాలం తర్వాత దేవిశ్రీ ప్రసాద్ మరియు రామజోగయ్య శాస్త్రి గురై కాంబినేషన్ లో పడనున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సాంగ్ కూడా డెఫినెట్ గా మంచి చార్ట్ బస్టర్ అవుతుందని సినీ వర్గాలు చెప్తున్నాయి. మరి ఈ అధికారిక అనౌన్సమెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక ఈ మాస్ ఎంటర్టైనర్ లో మాస్ మహారాజ రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.