మరోసారి బాలయ్యతో లేటెస్ట్ సెన్సేషన్ మలయాళ బ్యూటీ.?

Veera-Simha-Reddy-Movie

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ రెండు సినిమాలు అఖండ, వీరసింహా రెడ్డి చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్స్ అయ్యాయి. దీనితో మళ్ళీ తన ట్రాక్ లోకి వచ్చిన బాలయ్య లేటెస్ట్ గా అయితే తన కెరీర్ లో 108వ సినిమాని దర్శకుడు అనీల్ రావిపూడి తో లాక్ చేసిన చేసిన సంగతి తెలిసిందే.

దీనిని అనౌన్స్ చేయగా దీనిపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ శ్రీ లీల నటిస్తున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఈమె బాలయ్య కి కూతురు పాత్రలో కనిపించనుంది. కానీ ఇప్పుడు అసలు బాలయ్య సరసన హీరోయిన్ గా ఎవరు ఫిక్స్ అయ్యారు అనేది ఇప్పుడు సినీ వర్గాల్లో రూమర్స్ తో కన్ఫర్మ్ అయ్యిన న్యూస్ ఒకటి వినిపిస్తుంది.

మరి బాలయ్య సరసన ఈ సినిమాలో కూడా నటించే హీరోయిన్ మరెవరో కాదట. లేటెస్ట్ గా తన వీరసింహా రెడ్డి సినిమాలో మరదలిగా కనిపించిన మలయాళ బ్యూటీ హానీ రోస్ అని రూమర్స్ వినిపిస్తున్నాయి.. ఈమె ఈ సినిమాతో టాలీవుడ్ ఆడియెన్స్ లో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది.

ఇక ఈమెనే మళ్ళీ ఈమే బాలయ్య 108 లో కూడా హీరోయిన్ గా చేయనున్నట్టుగా వార్తలు మొదలయ్యాయి. కానీ ఇందులో మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి నిజం లేదట. . దీనితో వరుసగా మరోసారి ఈ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిందా లేదా అనేది మరికొంత సమయం ఆగి చూడాలి. ఇంకా ఈ సినిమాకి అయితే థమన్ సంగీతం వహిస్తున్నాడు అలాగే షైన్ స్క్రీన్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.