లేటెస్ట్ : ఫైనల్ గా “RC15” రిలీజ్ ని లాక్ చేసిన శంకర్.!

పాన్ ఇండియా సినిమా దగ్గర రాజమౌళి కన్నా ముందే తనదైన ముద్ర వేసిన దర్శకుడు శంకర్. తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చి తన సినిమాలతో సమాజంలో ఏదో ఒక మార్పు తీసుకురావాలని చూసే శంకర్ భారీ హంగులతో ఇండియన్ సినిమా దగ్గర తనదైన మార్క్ ని సెట్ చేశారు.

మరి ఈ దర్శకుడితో RRR లాంటి భారీ సక్సెస్ తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది అటు శంకర్ మరియు చరణ్ కెరీర్ లో 15వ సినిమాగా వస్తుండడం విశేషం. దీనితో ఇద్దరి కెరీర్ లో కూడా ఈ సినిమా స్పెషల్ ప్రాజెక్ట్ గా నిలవగా దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే గత కొన్నాళ్ల నుంచి ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనే అంశం ఆసక్తిగా మారగా ఈ భారీ సినిమా రిలీజ్ కి మంచి సమయాన్ని శంకర్ దిల్ రాజు తో కలిసి లాక్ చేసినట్టుగా మెగా వర్గాల నుంచి లేటెస్ట్ సమాచారం. మరి వారు చెప్తున్నా దాని ప్రకారం ఈ చిత్రం వచ్చే ఏడాది అంటే 2024 లోనే సంక్రాంతి బరిలో ల్యాండ్ అవ్వబోతుందట.

దీనితో ఈ భారీ ప్రాజెక్ట్ కోసం అప్పటివరకు ఎదురు చూపులు తప్పవు. కాగా ఈ చిత్రంలో చరణ్ సరసన మరోసారి బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుండగా అంజలి, రవిబాబు, శ్రీకాంత్, సునీల్ తదితరులు నటిస్తున్నారు అలాగే దిల్ రాజు నిర్మాణం అందిస్తున్నారు.