మెగా మేనల్లుడి కి భారీ హిట్ ఇవ్వబోతున్న క్రిష్ .. ఈ టైటిల్ తోనే ఇండస్ట్రీలో లెక్కలు వేసుకుంటున్నారు ..!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా క్రిష్ కి ఎంతో గొప్ప పేరుంది. ఆయన తీసిన సినిమాలన్ని గొప్ప సినిమాలే అని చెప్పాలి. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురం, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి.. ఇలా ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాలలో నిలిచే చిత్రాలనే అందించాడు. అంతేకాదు ఇండస్ట్రీలో కూడా క్రిష్ అంటే ప్రతీ ఒక్కరికి ఒక నమ్మకం. ముఖ్యంగా కంచె లాంటి సినిమా తీసి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి కెరీర్ లో గొప్ప సినిమా అని చెప్పుకునేలా చేశాడు. ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.

Krish Launches His Film With Vaishnav Tej

కాగా ఇప్పుడు మరో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కి కూడా భారీ హిట్ ఇవ్వబోతున్నట్టు ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. గమ్యం, వేదం, కంచె సినిమాల తరహాలోనే మంచి కథా బలమున్న సినిమా వైష్ణవ్ తేజ్ తో తీశాడని అంటున్నారు. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెన రిలీజ్ కాకుండానే క్రిష్ డైరెక్షన్ లో సినిమా కంప్లీట్ చేశాడు వైష్ణవ్. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. అందరీ లాక్ డౌన్ లో ఉండగానే క్రిష్ ఈ సినిమా సింగిల్ షెడ్యూల్ లో కంప్లీట్ చేశాడు.

కాగా ఈ సినిమాకి ప్రస్తుతం కొండపొలం అన్న టైటిల్ పెట్టాలని భావిస్తున్నాడట క్రిష్. క్రిష్ తెరకెక్కించిన కథ ఈ టైటిల్ పర్‌ఫెక్ట్ అని చెప్పుకుంటున్నారు. ఉప్పెన అలాగే క్రిష్ సినిమాలతో గనక బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటే ఇక టాలీవుడ్ లో మెగా హీరో సెటిలైనట్టే అని మెగా ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారట. ఇక ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేయడం తో పాటు త్వరలో ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టబోతున్నట్టు సమాచారం. ఇక ప్రస్తుతం క్రిష్ తన నెక్స్ట్ సినిమాని పవర్ స్టార్ తో తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే.