భారీ ధరలకు అమ్ముడుపోయిన ఖుషి నాన్ థియేట్రికల్ రైట్స్?

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత రౌడీ హీరో విజయ్ దేవరకొండ జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఖుషి.ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. ఇప్పటికే పలు షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా మరికొంత భాగం షూటింగ్ వాయిదా పడింది. సమంత అనారోగ్య సమస్య కారణంగా ఈ సినిమా కొద్ది రోజులపాటు వాయిదా పడినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా యధావిధిగా అనుకున్న విధంగా షూటింగ్ పనులను కనుక జరుపుకొని ఉంటే ఈ సినిమాని డిసెంబర్ 23వ తేదీ క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించారు.

నటి సమంత అనారోగ్యం కారణంగా ఈమె చికిత్స తీసుకుంటూ ఉండడంతో ఈ సినిమా కాస్త షూటింగుకు బ్రేక్ పడింది.ఇక ఇప్పుడిప్పుడే సమంత ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుండడంతో త్వరలోనే ఈ సినిమా సరికొత్త షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి కాకముందే భారీగా బిజినెస్ జరుపుకుంటుందని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఈయన మార్కెట్ ఏమాత్రం తగ్గలేదని ఖుషి సినిమా నిరూపిస్తోంది.

ఈ సినిమా ఇంకా దాదాపు 5 వారాలపాటు షూటింగ్ పనులను జరుపుకోవాల్సి ఉండగా ఇప్పటికే బిజినెస్ భారీగా జరుపుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమా డిజిటల్ హక్కులను ఓ ప్రముఖ సమస్థ భారీ ధరలకు కైవసం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇలా ఈ సినిమా నాన్ థియేటర్ రైట్స్ ఏకంగా 100 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయని తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఈ సినిమా షూటింగ్ పూర్తికాకుండానే ఈ స్థాయిలో బిజినెస్ జరుపుకోవడంతో సమంత విజయ్ దేవరకొండ క్రేజ్, వారికి మార్కెట్లో ఉన్న డిమాండ్ ఏంటో అర్థమవుతుంది.