హీటెక్కిస్తున్న సమంత ఫొటో!

సమంత సినిమాలు చేస్తున్నా, చెయ్యకపోయినా ఎప్పుడూ సాంఫీుక మాధ్యమంలో చురుకుగా ఉంటూ, తన అభిమానులతో తన కొత్త ఫోటోలను, తన సమాచారాన్ని పంచుకుంటూ ఉంటుంది. మయోసిటిస్‌ వ్యాధి సోకిన తరువాత సమంత విశ్రాంతి కోసం అమెరికా వెళ్ళింది, అక్కడ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న తరువాత మళ్ళీ ఇండియా వచ్చింది. ఆమె తన చివరి సినిమా ‘ఖుషీ’ ప్రచారాల్లో పాల్గొంది, ఇందులో విజయ్‌ దేవరకొండ కథానాయకుడు.

ఆ తరువాత వెంటనే అమెరికా వెళ్ళింది, అక్కడ విశ్రాంతి తీసుకుంటూ పలు నగరాలను సందర్శించింది. అవన్నీ కూడా తన అభిమానులకు ఆమె తన ఇన్స్టాగ్రామ్‌లో ఫోటోస్‌ పోస్ట్‌ చేస్తూ వస్తోంది. అమెరికా నుండి ముంబై వచ్చి అక్కడ కొన్ని ఫోటోషూట్‌ చేసింది, అవన్నీ కూడా తన ఇన్స్టాగ్రామ్‌ లో పోస్ట్‌ చేసింది. ముంబై నుండి మళ్ళీ హైదరాబాదు వచ్చి, ఇక్కడ ‘ది మార్వెల్‌’ ఇంగ్లీష్‌ సినిమా కోసం ప్రచారంలో పాల్గొంది.

ఈ ఇంగ్లీష్‌ సినిమా తెలుగులో కూడా విడుదలవుతోంది. అందుకని ఆ సినిమా ప్రచారానికి హైదరాబాదు వచ్చి ఇక్కడ ప్రచారంలో పాల్గొని తనకి మార్వెల్‌ సినిమాలు ఎంత ఇష్టమో కూడా చెప్పింది. ఈ సినిమా దీపావళి పండగ స్పెషల్‌ గా విడుదలవుతోంది. ఆ తరువాత ఒక వ్యాపార ప్రకటన కోసమని ఒక ఫోటోషూట్‌ చేసింది.

ఈ పండగ సీజన్‌ బోల్డ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌ లా ప్రకాశించాలి అనే వ్యాఖ్య వచ్చేట్టు ఒక రెండు వాక్యాలు కూడా పెట్టి ఈ ఫోటోలను షేర్‌ చేసింది సమంత. ఇందులో సమంత చాలా అందంగా, అసలు ఆమెకి వ్యాధి వున్నట్టే కనపడదు, ఆలా మెరిసిపోతూ కనపడుతోంది ఆ ఫోటోలో.

ఆమె ఈ ఫోటోల్లో చాలా అందంగా వున్నా, ఇప్పుడిప్పుడు అయితే ఆమె మళ్ళీ సినిమాలు చేసేటట్టు మాత్రం కనిపించటం లేదు. ఎందుకంటే ఆమె సినిమా కథలు వినటం లేదు, ఎవరూ ఆమెని సినిమా కోసమని సంప్రదించలేదు అని కూడా తెలిసింది. ఎప్పుడు నుండి మళ్ళీ సినిమాలు చేస్తుంది అనేది ఆమె త్వరలో తన అభిమానులతో పంచుకుంటుంది అని మాత్రం తెలుస్తోంది.