యాక్షన్‌తో ప్రేక్షకుల ముందుకు విజయ్‌దేవరకొండ!

విజయ్‌ దేవరకొండ, దర్శకుడు రాహుల్‌ సాంకృత్యన్‌ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌ నేచురల్‌ కామెడీ థ్రిల్లర్‌ ‘ట్యాక్సీవాలా’. యూనిక్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులని అలరించింది. ఇప్పుడు వీరి కాంబినేషన్‌ మళ్ళీ రీపిట్‌ కాబోతోంది. శ్యామ్‌ సింగరాయ్‌ తర్వాత రాహుల్‌ సాంకృత్యన్‌ మరో ప్రకటన రాలేదు. ఈ గ్యాప్‌ లో విజయ్‌ కోసం ఓ కథని రెడీ చేశారు.

ఈ స్క్రిప్ట్‌ పనులు దాదాపు చివరి దశకు వచ్చాయి. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో, పీరియాడిక్‌ యాక్షన్‌ మూవీగా ఈ కథ ఉండనుందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేనీ, యలమంచిలి రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఇటివలే వారి నిర్మాణంలో ఖుషీ సినిమా చేశారు విజయ్‌ దేవరకొండ. ప్రస్తుతం పరశురామ్‌ దర్శకత్వంలో ‘ఫ్యామిలీ స్టార్‌’ మూవీలో బిజీ గా వున్నారు విజయ్‌. రాహుల్‌ సాంకృత్యన్‌ తో చేసే సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది.