బాక్సాఫీస్ : 9 రోజుల్లో వసూళ్లతో “కేరళ స్టోరీ” మాస్ బ్యాటింగ్.!

గత కరోనా తర్వాత హిందీ బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి ఊహించని హిట్ గా నిలిచిన చిత్రం “కాశ్మీర్ ఫైల్స్” విజయాన్ని గాని అది రేపిన కాంట్రవర్సీ ని ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు. అయితే ఈ చిత్రం తర్వాత ఇదే తరహాలో పెద్ద ఎత్తున కాంట్రవర్సీ రేపిన లేటెస్ట్ చిత్రం “కేరళ స్టోరీ”.

దర్శకుడు సుదీప్త్ తెరకెక్కించిన ఈ చిత్రంలో నటి అదా శర్మ అయితే నటించింది. మరి కేరళ లో హిందూ మతానికి చెందిన అమ్మాయిల విషయంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం అయితే  కొల్లగొడుతుంది. అయితే ఈ సినిమా మొదటి రోజు 8 కోట్లు రాబట్టగా ఇండియన్ సినిమా దగ్గర ఇపుడు ఈ చిత్రం 100 కోట్ల మార్క్ ని 9 రోజుల్లో దాటేసింది.

అయితే ఆశ్చర్యకరంగా ఈ సినిమా 8వ రోజు 12.3 కోట్లు గ్రాస్ అందుకోగా 9వ రోజు ఊహించని విధంగా మొదటి రోజు కంటే ఎక్కువ మార్జిన్ తో 9 కోట్లు వసూలు చేసి 19.5 కోట్ల రికార్డు వసూళ్లు అందుకుంది. దీనితో ఈ చిత్రం మొత్తం 9 రోజుల్లో 113 కోట్లు గ్రాస్ ని రాబట్టేసింది.

దీనితో మళ్ళీ కాశ్మీర్ ఫైల్స్ తర్వాత అయితే అదే రేంజ్ లో రికార్డు వసూళ్లతో ఈ చిత్రం దూసుకెళ్తుంది అని చెప్పాలి. ఇక శనివారం వసూళ్లు అలా ఉంటే ఈ ఆదివారం ఈజీగా ఈ చిత్రం 20 కోట్ల గ్రాస్ ని ఇండియా లో అందుకుంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఫైనల్ రన్ లో 200 కోట్ల మార్క్ ని గాని కొడితే అది మాములు మాస్ బాటింగ్ కాదని చెప్పాలి.