నైస్ గా భలే జారుకున్న ఎన్టీఆర్..!

ఇప్పుడు ఏపీలో ఎలాంటి పరిస్థితి నెలకొందో తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని అయితే జైల్లో పెట్టడం అందరికీ షాకింగ్ గా మారగా వారి కుటుంబాల నుంచి ఉన్న హీరోలు అంతా కూడా తమ స్పందనను తెలియజేసారు.

కాగా నందమూరి బాలకృష్ణ, నారా రోహిత్ ఇలా చాలా మందే బాబు విషయంలో గళం విప్పగా ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మరియు నందమూరి కళ్యాణ్ రామ్ లు మాత్రం ఎలాంటి చప్పుడు ఇంకా చేయలేదు. అయితే దేవర షూటింగ్ విషయంలో బిజీగా ఉండి ఎన్టీఆర్ మాట్లాడలేదు తనకి సమయం లేకనే స్పందించలేదు అని చాలా మంది కవర్ చేసినా ఎన్టీఆర్ మాత్రం ఇపుడు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు.

ఎన్టీఆర్ లేటెస్ట్ గా దుబాయ్ లో జరుగుతున్నా గ్రాండ్ సైమా అవార్డ్స్ ఫంక్షన్ కి ముఖ్య అతిధుల్లో ఒకడిగా అయితే వెళ్ళాడు. ఇది చాలా మందికి తెలియని విషయం. నిన్ననే తాను ఏపీలో ఇంత జరుగుతున్నా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా అయితే వెళ్లిపోవడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది.

అయితే రాజకీయాల్లో ఎందుకు ఇప్పుడు తల దూర్చడం అనుకుంటున్నాడో ఏమో కానీ మాట్లాడాల్సిన సమయంలో కూడా లేకపోవడం చాలా మందికి నచ్చలేదు. దీనితో ఓ పక్క ఎన్టీఆర్ ని అలాగే టీడీపీని అభిమానించే వారి పరిస్థితి మరింత అయోమయంలో పడేసినట్టు అయ్యింది. మరి ఎన్టీఆర్ అయితే లేట్ గా అయినా స్పందిస్తాడో లేదో అనేది మాత్రం చూడాలి.